Friday, 30 June 2017

పర్యావరణంతో మనుగడ ; జీఎం రవిశంకర్

పర్యావరణంతో మనుగడ ; జీఎం రవిశంకర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); పర్యావరణముతోనే మనిషికి మనుగడ ఉంటుందని ,  ప్రకృతిలో మమేకమై ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని జీఎం రవిశంకర్ అన్నారు ప్రపంచ పర్యావరణ వారోత్సవాల సందర్బంగా శుక్రవారం  బెల్లం పెళ్లి ఏరియా గోలేటి లోని  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన  వివిధ ప్రతిభ  పోటీలలో  విద్యార్థుల కు బహుమతి ప్రధానం చేశారు.  ఈ సందర్బంగా జీఎం రవిశంకర్ మాట్లాడుతూ ప్రకృతిలోని జీవ జాతులన్నీ మానవ జాతి తప్ప ప్రకృతికి విగతం కలగకుండా ప్రకృతికి సానుకూలంగా జీవనం సాగిస్తున్నాయని కానీ మానవజాతి వింత చర్యలు వింత పోకడలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తూ ప్రకృతి విఘాతం కల్పిస్తున్నాయని తెలిపారు. మనమందరం ప్రకృతి లో మమేకం ఐ మొక్కలు నాటాలన్నారు .  ఇక నుంచి సర్వ మానవ జాతి ప్ర కృతి మరియు  పర్యావరణ విలువలను గుర్తించి ప్రకృతికి అనుకూలంగా జీవనం కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమం లో సదాశివ్. తిరుపతి. కే కొండయ్య. శ్రీరామ శాస్రి . కృష్ణ చారి . ఎన్ వెంకటేశ్వర్ రావ్ . తదితరులు పాల్గొన్నారు.

క్విజ్ పోటీలలో ఎస్ వి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రతిభ

క్విజ్ పోటీలలో ఎస్ వి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రతిభ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి);  బెల్లంపల్లి ఏరియా లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన క్విజ్ పోటీలలో రెబ్బెన కు చెందిన సాయి విద్యాలయం ఇంగీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ ను చాటారు . గోలేటి లో నిర్వహించిన క్విజ్ పోటీలలో స్థానిక ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆదె ప్రియాంక ప్రథమ స్థానమును సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు దీకొండ  సంజీవ్ కుమార్ తెలిపారు . అదే  విదంగా ఉపాన్యాసా పోటీలలో  8వ తరగతి చదువుతున్న కనక లక్ష్మి తృతీయ , సేండే సాయి కుమార్ తృతీయ స్థానములో నిలిచారు . వీరికి బెల్లంపల్లి ఏరియా జి ఎం రవి శంకర్ శుక్రవారం బహుమతులను అందజేశారు .వీరిని ఎంపిపి సంజీవ్ కుమార్ జెడ్పిటిసి బాబు రావు , ఎం ఏ ఓ వెంకటేశ్వర్లు , సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , ఆసిఫాబాద్ మార్కెట్ కమితి వైస్ ఛైర్మెన్ శంకరమ్మ , తహశీల్ధార్ రమేష్ గౌడ్ , నాయకులూ నవీన్కుమార్ జైస్వాల్ , సోమశేఖర్ , రాజేశ్వర్ రావు , మధునయ్య , చిరంజీవి గౌడ్ , సుదర్శన్ గౌడ్ , సదాశివ్. తిరుపతి. తదితరులు అభినందించారు .   

జులై 2వ తేదీన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశం

జులై 2వ తేదీన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశం 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి);  జులై 2వ తేదీన పీఆర్టీయూ జిల్లా స్థాయి సమావేశం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ లోని  వినయ్ గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని  కాబట్టి జిల్లా లోని పీఆర్టీయూ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి కె.జనార్దన్ కోరారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు కె.జనార్దన్,పూల రవీందర్,పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఫై.సరోత్తం రెడ్డి,ఏఐటిఓ ఛైర్మెన్ బి.మోహన్ రెడ్డి,పత్రిక ప్రధాన సంపాదకులు ఫై.సత్యనారాయణలు హాజరు అవుతరని తెలిపారు.ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించిన తర్వాత జిల్లాలో జరపబోయే సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.జిల్లా స్థాయి సమావేశం సందర్బంగా కొత్త జిల్లా సమితి ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆయనతో పాటు ఉపాధ్యాయులు సత్తెన్న,అనిల్,శ్రీనివాస్,పి.మల్లేష్,రోజారమని,స్వర్ణలత, పాల్గొన్నారు. 

నారాయణపుర్ లో గ్రామా సభ

నారాయణపుర్  లో గ్రామా సభ
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని  నారాయణపూర్ గ్రామంలో రెవెన్యూ మరియు వ్యవసాయ  ఉమ్మడి శాఖల అద్వర్యంలో శుక్రవారం రోజున గ్రామా సభ నిర్వహించారు.ఈ గ్రామా సభలో  ముఖ్య అతిధిగా రెబ్బెన మండల తహాశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ రైతుల కోసం నిర్వహించే గ్రామా సభలకు తప్పకుండా రైతులు హాజరయ్యి  సహకరించాలని కోరారు.భూముల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి,భూముల క్రమబద్దీకరణ  ఎంత శాతం వున్నదని తెలుసుకోవడం కోసం రైతు సమగ్ర సర్వే ఉపయోగపడిందని  అన్నారు..గత నెల నిర్వహించిన రైతు సమగ్ర సర్వే లో రైతులందరూ నమోదు చేసుకోవడం జరిగింది,ఆ సందర్బంగా నమోదు చేసిన వివరాలు సక్రమమైనవ,కాదా అని పరిశీలించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలను క్షున్నంగా  పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామా రెవెన్యూ  అధికారి  ఉమ్లాల్,వ్యవసాయ విస్తరణాధికారి అర్చన,గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.

ఒప్పంద అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలి

ఒప్పంద  అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 (వుదయం ప్రతినిధి); ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ల పునరుద్ధరణలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 223ను పునరుద్ధరించి జీవో నెంబర్  302ను   ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడికి ప్రభుత్వం  తీసుకువచ్చే ప్రయత్నం చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3687 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని,వెంటనే అలంటి ఆలోచనలను విరమించుకోవాలని  ఆర్జేడీ సంఘం రాష్ట్రా కోశాధికారి బుర్రి రాజు అన్నారు.శుక్రవారంనాడు రెబ్బేనకు వచ్చిన ఆయన మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాలు అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతు రాష్ట్రoలోని ఒప్పంద అధ్యాపకులు ఎదురుకుంటున్న సమస్యలపై ,ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కారించాలని కోరారు.ఈ సమావేశం లో ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

Thursday, 29 June 2017

ప్రకృతిలో మమేకమై మొక్కలు నాటుదాం ;జీఎం రవిశంకర్

ప్రకృతిలో మమేకమై మొక్కలు నాటుదాం ; జీఎం రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 (వుదయం ప్రతినిధి);  ప్రకృతిలో మమేకమై ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని జీఎం రవిశంకర్ అన్నారు ప్రపంచ పర్యావరణ వారోత్సవాల సందర్బంగా గురు వరం బెల్లం పెళ్లి ఏరియా గోలేటి లోని వివిధ పాఠశాలల  విద్యార్థుల చే కార్యాలయం నుండి ర్యాలీని నిర్వహించి అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మనమందరం ప్రకృతి లో మమేకం ఐ మొక్కలు నాటాలన్నారు . ప్రకృతిలోని జీవ జాతులన్నీ మానవ జాతి తప్ప ప్రకృతికి విగతం కలగకుండా ప్రకృతికి సానుకూలంగా జీవనం సాగిస్తున్నాయని కానీ మానవజాతి వింత చర్యలు వింత పోకడలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తూ ప్రకృతి విఘాతం కల్పిస్తున్నాయని తెలిపారు. ఇక నుంచి సర్వ మానవ జాతి ప్ర కృతి మరియు  పర్యావరణ విలువలను గుర్తించి ప్రకృతికి అనుకూలంగా జీవనం కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమం లో సదాశివ్. తిరుపతి. కే కొండయ్య. శ్రీరామ శాస్రి . కృష్ణ చారి . ఎన్ వెంకటేశ్వర్ రావ్ . తదితరులు పాల్గొన్నారు.

మధ్యన బోజన పథకాలను స్వచ్చంధా సేవ సంస్థకు అప్పగించరాదు

మధ్యన బోజన పథకాలను స్వచ్చంధా  సేవ సంస్థకు అప్పగించరాదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 (వుదయం ప్రతినిధి);      మధ్యన భోజనం పథకాన్ని స్వచ్చంధ సంస్థకు అప్పగించరాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ అన్నారు , గురువారం రెబ్బన మండలం లో తహసిద్దర్ కార్యాలయం ముందు మధ్యన భోజన కార్మికుల తో కలిసి తహసిల్ధార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్ధార్ కి వినతి పత్రం అందించారు ఈ సందర్బంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ మధ్యన భోజన వర్కర్లకు కనీస వేతనం 18000లు ఇస్తూ వారికీ ప్రభుత్వం సరుకులను అందజేయాలన్నారు కోడి గుడ్లకు ప్రత్యేక బడ్జెటు కేటాయించాలన్నారు , వంట గదులు . మంచినీళ్లు , వంట్ట సామాగ్రి మరియు మౌలిక సదుపాయాలను అందజేయాలన్నారు , ఇతర రాష్టాలలో వేతనాలు చెల్లిస్తున్న మన రాష్టం లో చెల్లించడం లేదు అన్నారు .  ఈ సమస్యలను వెంట్లనే పరిష్కరించాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా  నాయకులూ దుర్గం దినాకర్ . మధ్యన భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చాపిడి మాయ దుర్గం పద్మ . తనుబాయి . మల్లికాంబ . సావిత్రిబాయి. గంగక్క తదితరులు పాల్గొన్నారు

నిత్యావసర సరుకులు పంపిణి లో ప్రభుత్వాలు విఫలం ; ఏఐటీయూసీ

నిత్యావసర సరుకులు పంపిణి లో ప్రభుత్వాలు విఫలం ; ఏఐటీయూసీ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 (వుదయం ప్రతినిధి);     పెద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణి  చెయ్యడం లో రాష్టప్రభుత్వం విఫలం అయిందని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ మండల కార్యదర్శి రాయిలా నర్సయ్య అన్నారు , ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో అమ్మ అభయహస్తం పేరుతో 14 రకాలు నిత్యావసర సరుకులు పంపిణి చేసిందని కానీ తెలంగాణ రాష్టం లో మాత్రం ఒక్కొక్క నిత్యావసర సరుకులు తగ్గిస్తూ చివరకు బియ్యం కిరోషిన్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు . బంగారు తెలంగాణ పేరుతో అధికారం లోకి వచ్చిన తెరాస పార్టీ ఇప్పుడు నిత్యావసర సరుకుల పంపిణి చెయ్యడం లో గోరంగా విఫలం అయిందని అన్నారు బంగారు తెలంగాణ అంటే  ఇదేనా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమం లో  రామడుగుల శంకర్ . తోట  తిరుపతి, తదితరులు ఉన్నారు.

Wednesday, 28 June 2017

డిజిటలైజేషన్ ప్రక్రియతో నేరాల అదుపు లో మరింత పెరిగిన పోలీసుల సమర్ధత - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

డిజిటలైజేషన్ ప్రక్రియతో నేరాల అదుపు లో మరింత పెరిగిన  పోలీసుల సమర్ధత  - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 (వుదయం ప్రతినిధి);     జిల్లా పోలీసు విభాగము ను డిజిటలైజ్ ప్రక్రియతో ఆధునికీకరించడంతో   జిల్లా పోలీసు వ్యవస్థ ఎంతో ముందంజ లో నిలుస్తుందని  జిల్లా  ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు , అత్యంత అధునిక సాంకేతిక విజ్ఞానం  ను జిల్లా కు  తీసుకురావడము లో బాగముగానే జిల్లా లో సీ.సీ.టీ.న్.స్   (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం ) ను ఏర్పాటు  చేసాము అని ఈ ఆన్ లైన్  వ్యవస్థ వల్ల దెశం లొని - రాష్ట్రము లొని పోలిసుల మధ్య సమాచార మార్పిడి వేగముగా జరుగుతుందని  పాత   నేరస్థుల వివరాలు ,వారి యొక్క నేరం అవలంబించే పద్దతులను తెలుసుకొని నేరాల నివారణ చేయగలము అని జిల్లా ఎస్పి తెలిపారు .బుదవారం స్థానిక AR హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన సమావేశం లో జిల్లా ఎస్పి ,పోలీసు స్టేషను ,సర్కిల్ , సబ్ డివిజన్ ల వారిగా  సీ.సీ.టీ.న్.స్  యొక్క పనితీరు ను సమీక్షించారు ,మరియు సీ.సీ.టీ.న్.స్ యొక్క పని తీరు ను  పరిశీలించి  సంతృప్తి  ఏంటో ఏంటో  వ్యక్తం చేశారు ,జిల్లా లొనే కౌటాల సర్కిల్ సీ.సీ.టీ.న్.స్ పనితీరు లో  మొదటి  స్థానం లో ఉందన్నారు మరియు సీ.సీ.టీ.న్.స్ అసిస్ట్ గా పని చేస్తున్న కానిస్టేబుల్   పీసీ -3233   భూక్యా  గంగాధర్  కు నగదు  ప్రోత్సహకము  గా  2000/- రూపాయలను  అందచెసారు,అంతేకాక ఎంతో కృషి తో కౌటాల సర్కిల్ ను మొదటి స్థానం కు తీసుకువచ్చిన సర్కిల్ ఇనస్పెక్టర్  అచ్చేశ్వర్  రావు ను జిల్లా ఎస్పి గారు అభినందించారు. ఈ కార్యక్రమము లో  డిఎస్పీ హబీబ్ ఖాన్ , ఎస్బి సీ ఐ వెంకటేశ్వర్ , ఆసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీష్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ , జిల్లా లోని సీ ఐ లు ,ఎసై లు ,ఎస్పిసీసీ శ్రినివాస్ మరియు  పి.ఆర్.ఓ మనోహర్  పాల్గొన్నారు.

Tuesday, 27 June 2017

ఆధునిక సాంకేతికత తోనే నేరరహిత సమాజం సాద్యం – ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ఆధునిక సాంకేతికత తోనే  నేరరహిత సమాజం సాద్యం – ఎస్పి సన్ ప్రీత్ సింగ్



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 (వుదయం ప్రతినిధి);   ఆధునిక సాంకేతికత  ను అందిపుచ్చుకుంటూ,సమాజం లొ పాత మరియు సాంప్రదాయ పద్దతులకు  స్వస్తి పలికి ఆదునిక వ్యవస్థ  ను జిల్లా పోలీసులు ప్రవేశ పెట్టారు ,జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పోలిసుల విచారణ  సులభతరం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా CCTNS, రాపిడ్ కాప్స్ లాంటి కార్యక్రమాలు వంటివి వి ప్రవేశ పెట్టారు,అదే బాటలో అనుమానితులను, ఆరోపించబడిన  వ్యక్తులను తక్షణo నిర్దారించుకుందుకు జిల్లా ఎస్పి స్థానిక AR హెడ్ క్వార్టర్ లోని నూతన కాన్ఫరెన్స్ హాల్ లొ మంగళ వారం రోజున జిల్లా లోని లో పోలీసు అదికారులందరికీ నూతనముగా జిల్లా లొ ప్రవేశపెట్టబడిన  AFIS( ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం) లో బాగము గా 1) ఫింగర్ ప్రింట్ లైవ్ స్కానర్ 2) మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ల వంటి ఆటోమేటిక్  సాధనాలను జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  జిల్లా అధికారులకు పరిచయo చేసి ,శిక్షణ కార్యక్రమము ను జిల్లా లొ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమము లొ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఆస్థి నేరాలు , నేర గుర్తింపునకు  మరియు నేరాల పెరుగుదలను  దృష్ట్యా జిల్లా లోని పోలీసు స్టేషన్ కు వీటిని అందించనున్నామని  ఆధునికత వైపు జిల్లా పోలీసులు ముందు వున్నారని  ఈ సాంకేతికతను వాడుకొని  కేసు లను త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు ,CLUES( క్రైమ్ లేబొరటరీ అల్టిమేట్ ఎవిడెన్స్ సిస్టం ) మరియు AFIS  లకు జిల్లా ఎస్పి  గారి స్వీయ పర్యవేక్షణలో ఒక సబ్ ఇనస్పెక్టర్ J.శ్యాం సుందర్ మరియు పీసి లు A. తిరుపతి మరియు J.శ్రినివాస్ లను  ఈ విబాగం పటిష్టతకు క జిల్లా ఎస్పి నియమించారు. ఈ కార్యక్రంలో  ఎస్బి సీ ఐ వెంకటేశ్వర్ , ఆసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీష్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ , జిల్లా లోని సీ ఐ లు ,ఎసై లు ,ఎస్పిసీసీ శ్రినివాస్ మరియు  పి.ఆర్.ఓ మనోహర్  పాల్గొన్నారు.

Monday, 26 June 2017

జూన్ 26ను చీకటి దినంగా ప్రకటించాలి : భాజపా

జూన్ 26ను చీకటి దినంగా ప్రకటించాలి : భాజపా 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26  (వుదయం ప్రతినిధి);   జూన్ 26ను దేశ చరిత్రలో చీకటి దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు రెబ్బేన  మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ కేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం  చేశారు.ఈ సందర్బంగా భాజపా జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా,రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యవసర పరిస్థితులను కల్పించి,ప్రజాస్వామ్యాన్ని కుని చేసిందని అన్నారు. న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి,న్యాయవ్యవస్థను అగౌరవ పాలు చేసిందని దుయ్యబట్టారు.అత్యవసర  పరిస్థితి ముసుగులో అప్పటి ప్రభుత్వం   చేసిన అరాచకాలకు,అన్యాయాలకు ఎదురు తిరిగిన వారిని అన్యాయంగా అరెస్టులు చేయించినా ఘనత అని విమర్శించారు.కాబట్టి జ్ఞే 26 ను చీకటి దీనంగా ప్రకటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులూ గుల్భము చక్రపాణి,మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సునీల్ చౌదరి,నాయకులూ గట్టు తిరుపతి,హస్ముక్లాల్,దేవేందర్ రెడ్డి,మండల మధుకర్,గాజుల మల్లేష్,నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అనందోత్సాహ లతో ఈద్ ఉల్ ఫితర్ సంబరాలు

అనందోత్సాహ లతో  ఈద్ ఉల్ ఫితర్  సంబరాలు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26  (వుదయం ప్రతినిధి);  నెలరోజుల ఉపవాసాల అనంతరం నెలవంక కనిపించిన మరుసటి రోజు  పవిత్ర రంజాన్‌  పర్వదినం నుపురస్కరించుకుని  చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే 'రంజాన్ ' సోమావారం నాడుజిల్లాలోఅంతటా పండుగవతవరణం కనిపించింది ఆసిఫాబాద్,రెబ్బెన మండలాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు పెద్దఎత్తున తరలివచ్చి సర్వ మానవాళి క్షేమాన్ని ఆశించి పవిత్ర ప్రార్ధనలు  చేసారు.   ముస్లిం మత పెద్దలు  ముస్లింసోదరులకు  ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు బంధు, మిత్రులను  స్నేహితులను మతాలకతీతంగా  ముస్లిం సోదరులు ఆలింగనము చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా రెబ్బన ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్దకు వెళ్లి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెబ్బెన ఎస్సై నరేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  

Saturday, 24 June 2017

నేర సమీక్షా సమావేశం ను నిర్వహించిన జిల్లా ఎస్పి – సన్ ప్రీత్ సింగ్

నేర సమీక్షా సమావేశం ను నిర్వహించిన జిల్లా ఎస్పి – సన్ ప్రీత్ సింగ్


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24  (వుదయం ప్రతినిధి);   పోలీసులు ప్రజల కు నమ్మకం కలిగేలా ,విదులను కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలనీ  అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు సూచించారు శనివారం కుంరం భీం జిల్లా హెడ్ క్వార్టర్ లో  ని నూతనము  గా నిర్మించిన  కాన్ఫరెన్స్ సమావేశమందిరం లో జిల్లా ఎస్పి గారు నేర సమిక్ష సమావేశం ను నిర్వహించారు .ఆయన మాట్లడుతూ ప్రజా సంక్ష్యేమం కు ప్రథమ ప్రాధాన్యం జిల్లా లోని మారుమూల గ్రామల అభివృద్ధి కు పునరంకితం అవ్వాలని ,నేర పరిశోదనలో టెక్నాలజీ ను వాడుకోవాలని ,నేర విచారణ వేగవంతం గా క్రమబద్దం గా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని , స్టేషన్ లోని పెండింగ్ కేసు లు యొక్క పూర్వ పరాలు తెలుసుకొని తగిన సూచనలను చేసారు  ,పరిష్కారం కానీ కేసులు పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు జిల్లా లో జరిగే నేరాల పట్ల అప్రమత్తతో వుండాలి అన్నారు , పోలీసు స్టేషను కు వచ్చే ఫిర్యాదు దారుల తో హుందాగా గౌరవం గా మెలగాలి ,పోలీసులు అంటే ప్రజాసేవకులు అని గుర్తుచుకోవాలన్నారు , విలేజ్ పోలీసింగ్ లో వారి,వారి కి  కేటాయించిన గ్రామాల సందర్శన ఆయా గ్రామాల సమాచార సేకరణ,వాటి పైన  గ్రామస్తుల స్పందనను,గ్రామల లో గల సమస్యలను నోట్ చేసుకుని  క్రమము తప్పకుండా తన  ద్రుష్టి కు తీసుకు రావాలని  ఇందులో నిర్లక్ష్యం వహించిన వారి పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఖరిఫ్ సీజన్లో జరిగే విత్తనా మోసాల పైన  అవగాహన సదస్సులు నిర్వహించి నకిలీ విత్తనాలను నిర్మూలించేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ ,డిసీఅర్బీ ఎసై రాణాప్రతాప్ ,అసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్ ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి  కోర్ ఇంచార్జీ శ్రీనివాస్,J.శ్రీనివాస్   ,పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

నూతన సాంకేతిక ను అందిపుచుకున్న కుమ్రం భీమ్ జిల్లా పోలీసులు

నూతన సాంకేతిక ను అందిపుచుకున్న కుమ్రం భీమ్ జిల్లా పోలీసులు

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24  (వుదయం ప్రతినిధి); పోలీసులు ప్రజలకు వేగవంతమైన,నాణ్యమైన  సేవలు అందించే దృడ సంకల్పం తో జిల్లా పోలీసులు శనివారం స్థానిక AR హెడ్ క్వార్టర్ లొ నూతనముగా నిర్మించిన ఆదునిక కాన్ఫరెన్స్ హాల్ ను జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు ప్రారంబించి ,జిల్లా ప్రజల కోసం “ రాపిడ్ కాప్స్” అను కొత్త కార్యక్రమము ను ట్రయల్  రన్ ను నిర్వహించారు,జిల్లా లొ మొదట గా ఆసిఫాబాద్ ,కాగజ్ నగర్ ల లొ “ రాపిడ్ కాప్స్”ను ప్రారంబించి,జిల్లా మొత్తం వ్యాప్తి చేస్తాము అని జిల్లా ఎస్పి గారు తెలిపారు, రాపిడ్ కాప్స్ వల్ల అత్యవసర సేవలను ,ప్రమాదము లొ వున్నా వారికీ సహాయము ను వేగాము గా చేరేందుకు GPS అనుసందానిత కలదు అని , పోలిసుల వాహనాలు అన్నిటిలో ఇవి అమర్చబడి ఉంటాయి అని, వాహనాల యొక్క వేగమును అంచనా వేసే లేసర్ గన్ ల తో పాటు అంబులెన్స్, ఫైర్ ,ఆసుపత్రి లకు  సమాచారం అందించే నూతన వ్యవస్థ ను జిల్లా లొ అమలు చేస్తాము అని జిల్లా ఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ ,డిసీఅర్బీ ఎసై రాణాప్రతాప్ ,అసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్ ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి  కోర్ శ్రీనివాస్,J.శ్రీనివాస్   ,పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

విశ్వబ్రాహ్మణుల సభ్యత్వ నమోదు

విశ్వబ్రాహ్మణుల సభ్యత్వ నమోదు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24  (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామ దేవాలయంలో శనివారం విశ్వబ్రాహ్మణ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ వ్,లక్ష్మణాచార్య ,కో కన్వీనర్ నల్లగొండ సదాశివ్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ గారు 200 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోనివిశ్వబ్రాహ్మణులు అందరు సంఘటితంగా  ఉండాలని అప్పుడేతమ కోర్కెలు బలంగా వినిపించవచ్చని తెలిపారు .ఈ కార్యక్రమంలో నాయకులూ తొగేటి లక్ష్మణ్ ,వెంకటేశు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అష్టకష్టాల ఆసరా ; బోగే ఉపేందర్

అష్టకష్టాల ఆసరా ; బోగే ఉపేందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24  (వుదయం ప్రతినిధి);   ఆసరా పెన్షన్ దరఖాస్తుదారులు  గత 8 నెలల నుండిరెబ్బెన ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తమ ఆసరా పెన్షన్ మంజూరుకు కాళ్ళుఅరిగేలా  తిరిగిన ఫలితం లేకుండా పోయిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,మండలాకార్యదర్శి నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీడీఓ గారికి వినతిపత్రం అందజేస్తూ లబ్ధిదారులకు పోస్టాఫిసులలో చిట్టిలు రసీదులూగ  వస్తున్నా వాటిలోటెంపరరీ  మైగ్రేషన్ అని చూపిస్తున్నారు. దింతో గందరగోళానికి గురై  ఆసరాపెన్షన్ ఆశావహులు ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ ప్రతిరోజూఎంతో  వ్యయ ప్రయాసలకు గురైఆర్ధికంగా నష్టపోతున్నారని తెలిపారు. 

వైకుంఠ ధామం కొరకు భూమిని కేటాయించాలి

వైకుంఠ ధామం కొరకు భూమిని కేటాయించాలి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24  (వుదయం ప్రతినిధి);   వైకుంఠ ధామం (శ్మశాన వాటిక)  కొరకు భూమిని కేటాయించాలని  శనివారం హిందూ సేవాసమితి ఆధ్వర్యంలో రెబ్బెన తాహసిల్దార్ కు  వినతి పత్రం అందజేశారు. అనంతరం హిందూ సేవ సమితి వారు మాట్లాడుతూ రెబ్బెన మండల కేంద్రంలో గత కొన్నీ సంవత్సరాలుగా క్రితం  స్మశానా నికి కేటాయించిన స్థలాన్ని కబ్జాకు గురైందని ప్రస్తుతము  దహన సంస్కారానికి సరైన చోటు లేక రెబ్బెన ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాశ్మన వాటికలు కోసం నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో రెబ్బెన మండల కేంద్రానికి శాశ్వత శ్మశాన వాటిక కొరకై స్థల సేకరణ చేయలని  కోరారు ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ శ్మశాన వాటిక కోసం సర్వ్ నిర్వహించి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రంలో సర్పంచ్ పేసరి వెంకటమ్మ,సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య, మోడెం  సుదర్శన్ గౌడ్, గుడిసెల వెంకటేశ్వర్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్, చందూలాల్ అగర్వాల్, అజయ్ జైష్వల్, మడ్డి శ్రీనివాసగౌడ్, దుర్గందేవాజి, మౌడెం చిరంజీవిగౌడ్, అజ్మీరా వస్రం నాయక్, కొయ్యడ రాజాగౌడ్, రామడుగుల శంకర్ ,కుందారపు బాలకృష్ణ, రాపర్తి అశోక్, బొడ్డు శ్రీనివాస్ తదితరులు పాల్గున్నారు. 

Friday, 23 June 2017

విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23  (వుదయం ప్రతినిధి);  రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. శుక్రవారం రోజున విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎఐఎస్ఏఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యార్థుల సమస్యలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందరాని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు,త్రాగునీటి సౌకర్యం,ప్రహరీ గోడ తదితర సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.ఇప్పటికి పూర్తిగా పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి, ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని,తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని,ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,ప్రైవేట్ విద్యాసంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ అధ్యక్షుడు వికాస్,కార్యదర్శి పుదారి సాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి,ప్రణయ్, తిరుపతి,మహిపాల్,సాయి,శ్రీకాంత్,రవివర్మ,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ పేద కుటుంబాలకు ఉచిత దుస్తుల పంపిణీ

   మైనార్టీ  పేద  కుటుంబాలకు ఉచిత దుస్తుల పంపిణీ 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23  (వుదయం ప్రతినిధి); మైనార్టీ పేద కుటుంబాలకు రెబ్బనలో శుక్రవారం ఎం పి పి సంజీవ్ కుమార్, ఎం పిడిఓ సత్యనారాయణ సింగ్   తహసీల్దార్ రమేష్ గౌడ్ శుక్రవారం ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీ  పేద కుటుంబముల కోసం తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ కార్యక్రమాలు కుల మతలకు అతిహితముగా ఏర్పాటు చేస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ వైస్ మార్కెట్ చెర్మన్ కుందారపు శంకరమ్మ, వైయస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ ,మండల కో అప్షన్ సభ్యుడు జాకీర్ హుస్మాని,జామ మసీద్ కమిటీ అధ్యక్షుడు అజీజ్ ,టి ఆర్ ఎస్ మైనార్టీ మండల అధ్యక్షుడు చోటు , సింగిల్ విండో డైరెక్టర్  మధునయ్య,టి ఆర్ ఎస్ నాయకులు  నవీన్ కుమార్ జైస్వాల్,   సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్ ,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

డాక్టర్ శ్యామ్ ప్రకాస్ ముఖర్జీ 62వ వర్ధంతి

డాక్టర్ శ్యామ్ ప్రకాస్ ముఖర్జీ 62వ వర్ధంతి 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23  (వుదయం ప్రతినిధి);  రెబ్బన మండలం లోని గోలేటి బీజేపీ కొమురం బీమ్ జిల్లా కార్యాలయం లో శుక్రవారం డాక్టరు శ్యామ్ ప్రకాష్ ముకర్జిమ్  62వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు జేపీ పౌడెల్ పులా మాలలు వేసి నివాలు అర్పించారు. ఈ సందర్బంగా అయన చేసిన ప్రజా సేవను కొని ఆడారు జనసంఘ్ వ్యవస్థాపకుడని భారత దేశ సమగ్రత లో ప్రజలను అవగాహనా  కల్పిస్తూ ఎన్నో ఉద్యమాలు చేపట్టి సమస్త మనుగడకు ఎంతో కృషి చేసారని అన్నారు అయన అడుగుజాడల్లో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆంజనేయులు గౌడ్ , చెక్రపాణి , విజయ్, అశోక్ , శ్రీనివాస్ ,తిరుపతి  తదితరులు పాల్గొన్నారు.

Thursday, 22 June 2017

కార్మికులు యధావిధిగా విధులకు హాజరు ; జనరల్ మేనేజర్ రవిశంకర్

కార్మికులు యధావిధిగా  విధులకు హాజరు ; జనరల్ మేనేజర్ రవిశంకర్


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి);  సింగరేణిలో వారసత్వం అమలు చెయ్యాలని ఐదు జాతీయ సంఘలు  తలపెట్టిన నిరవధిక సమ్మె పిలుపుకు కార్మికులు యధావిధిగా విధులకు హాజరవుతున్నారని ఏరియా జనరల్ మేనేజర్ కె రవిశంకర్ తెలిపారు. ఈ నెల 15  నుండి ప్రారంభమైన సమ్మెలో  బెల్లంపల్లి ఏరియా లో హాజరు శాతం ఉత్పత్తి వివరాలు తెలిపారు.  మొదటి రోజు 51 శాతం హాజరు, రెండవ రోజు 57 శాతం హాజరు,  మూడవరోజు 62 శాతం హాజరుక, నాలుగవరోజు 77 శాతం హాజరు, ఐదవరోజు 77 శాతం హాజరు, ఆరవరోజు 87 శాతం హాజరుకాగా  ఏడవరోజు93శాతం హాజరుతో కార్మికులు ఏలాంటీ ఆటంకం లేకుండా విధులకు హాజరు కావడం జరిగిందన్నారు. ఎనిమిదవ రోజున మొదటి షిప్ట్ లో 95  కార్మికులు హాజరైనారు మొదటి షిప్ట్ లో కార్మికులు 1282 మందికి 895 హాజరైనారు బొగ్గు ఉత్పత్తికి సహకరిస్తూ తమ వంతు కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గురువారం రోజున మొదటి షిప్ట్ లో 6050 టన్నుల లక్ష్యం కు గాను 7301 తన్నులు సాధించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో అన్ని ఏరియాలకు హాజరుశాతం గణనీయంగా పెరిగింది అన్నారు.  మిగతా కార్మికులు తమ వేతనాలు నష్టపోకుండా వెంట్లనే విధులకు హాజరు అవుతూ సంస్థ అభివృధికి సహకరించలని కోరారు.

వారసత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి స్పందించాలి ; సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ

వారసత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి స్పందించాలి ; సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి);   సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకూ కార్మికుల పక్షాన పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ అన్నారు.సింగరేణిలో జరుగుతున్న సమ్మె సందర్భంగా  గురువారం రోజున రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం,టీ.ఆర్.యస్., టిబిజికెయస్ పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గుర్తింపు సంఘంగా గెలిచిన టిబిజికెయస్ గ్రూపులుగా విడిపోయి డబ్బుల విషయంలో కోర్టు చుట్టు తిరుగుతూ నాలుగు సంవత్సరాలు కాలాయపన చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాల పైనే పెడుతానని హమీ ఇచ్చిన కెసిఆర్ మరచిపోయారని అన్నారు. కనీసం కార్మిక చట్టాలపై అవగాహన లేని టిబిజికెయస్ సమ్మెను విఫలం చేయాడానికి చూడడం సిగ్గుచెటన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మికులు స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటే సమ్మెను విఫలం చేయాడానికి యాజమాన్యం టిబిజికెయస్ టి ఆర్ యస్ కుట్రలు పన్నుతుందని దానిని కార్మికులు గమనిస్తున్నరని అన్నారు. యాజమాన్యం ఎప్పుడు లేని విధంగా సింగరేణిలో పోలీసు బలగాలను మోహరించి కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయిస్తుందని దీనిని సిపిఐ పార్టీ ఖండిస్తూందని అన్నారు. అలాగే టిబిజికెయస్ కార్మికుల పక్షామో కాదో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వారసత్వ ఉద్యోగాల కల్పనకై జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెలో కలిసి రావాలని లేకుంటే టిబిజికెయస్ కు కార్మికులు తగిన బుద్ధి చేప్తారని హెచ్చరించారు.గురువారం నిర్వహించిన కోల్ బెల్ట్ బంద్ లో పాల్గొన్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాడి గణేష్, ఎఐటియుసి మండల కార్యదర్శి నర్సయ్య, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలు తనిఖీ

జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలు  తనిఖీ  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి);  జిల్లా  వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రెబ్బన మండలం వ్యవసాయ ఎరువులు,విత్తనాలు దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా దుకాణాల అనుమతి పత్రాలు, కొనుగోలు రసీదులు విక్రఇంచిన్న ఖాతాపుస్తకాలు వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించి రైతులకు సహకారం అందించాలి అని  సూచించారు. ఏడిఏ లు కృష్ణ, అలీమ్ అహమద్ ఏఓ మంజుల, ఏఈఓ మార్క్ తదితరులు  పాల్గొన్నారు.      

అక్రమ అరెస్ట్ లు ఆపాలని తహశీల్ధార్ కు వినతి

అక్రమ అరెస్ట్ లు ఆపాలని తహశీల్ధార్ కు వినతి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో కార్మికుల న్యాయమైన డిమాండ్ వారసత్వం కోసం ఏఐటీయూసీ శ్రేణులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారంనాడు రెబ్బెన మండల తహశీల్ధార్ బండారి రమేష్  గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సంధర్బంగా ఏఐటీయూసీ బిపిఎ ఓసిపి  ఫిట్ కార్యదర్శి శేషు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో  ఏఐటీయూసీ నాయకులూ చుంచు రాజన్న,దివాకర్,జాడి స్వామి,బాపు,పాల్గొన్నారు.

జనరల్ మేనేజర్ కార్యాలయం ముట్టడించిన ఏఐటీయూసీ శ్రేణులు

జనరల్ మేనేజర్ కార్యాలయం ముట్టడించిన ఏఐటీయూసీ శ్రేణులు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో  కార్మికుల ప్రధానమైన డిమాండ్ వారసత్వ ఉద్యోగాల కోసం అన్ని జాతీయ సంఘాలు ఈ నెల 15వ తేదీ నుండి నిరవధిక  సమ్మె తలపెట్టిన  విషయం విదితమే.దానిలో భాగంగా సమ్మె  తలపెట్టి గురువారం నాటికి 8వ రోజు కాగా రెబ్బెన మండలం గోలేటిలోని జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని జాతీయ సంఘం అయిన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముట్టడించి ధర్నా కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ సంధర్బంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి,గోలేటి  బ్రాంచ్ ల  ఇంచార్జి చిప్ప నర్సయ్య మాట్లాడుతూ   రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని అన్నారు.సింగరేణిలోనే కాకుండా తెలంగాణ స్వరాష్ట్రంలో అవినీతి,అక్రమాలు పెరిగాయని,తెరాస పాలకులు భూ దందాలు, పోటీ పరీక్షలలో పైరవీలకు ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిచారు.టిబిజికకేఎస్ వారసత్వ   ఉద్యోగాలను కల్పించకపోవడమే కాకుండా,వారసత్వాల కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను విచ్చిన్నం చేసి మరో సారి కార్మికులను మోసం చేసిందని దుయ్యబట్టారు.దీనిని కార్మికులు గుర్తుపెట్టుకొని టిబిజికేఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.అవగాహనా లోపం,కార్మిక చట్టాలు తెలియని ప్రాంతీయ సంఘాలను సింగరేణిలో పాతరవేయాలని అన్నారు.కార్మికులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెలో స్వచ్చందoగా సమ్మెలో పాల్గొనాలని కార్మికులను వారు కోరారు.అంతక ముందు  జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏఐటీయూసీ,సిపిఐ,నాయకులూ భూక్య జగ్గయ్య,జూపాక రాజేష్,సోకాల శ్రీనివాస్,సత్యనారాయణ,బిక్షుమయ్య,చంద్రశేఖర్,బోగే ఉపేందర్,రవీందర్,చుంచు రాజన్న,దివాకర్,జాడి స్వామి,బాపు,నర్సింగరావు,కిరణ్ బాబు,బాలయ్య,పరికిపండ్ల రమేష్,ఎం.శేషు,రాయిల్ల నర్సయ్య,కార్మికులు పాల్గొన్నారు.

కోల్ బెల్ట్ దుకాణాల బంద్ విజయవంతం

కోల్ బెల్ట్ దుకాణాల బంద్  విజయవంతం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22  (వుదయం ప్రతినిధి); సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని గత వారం రోజులుగా జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు కార్మిక సంఘాల,రాజకీయ పార్టీల పిలుపు మేరకు గోలేటిలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ విజయవంతం. బంద్ కు సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు జాతీయ కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు సిపిఐ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.

Wednesday, 21 June 2017

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21  (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో గోలేటిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా     బెల్లంపల్లి ఏరియా జనరల్  మేనేజర్ కె రవిశంకర్ మాట్లాడారు.   యోగతో సంపూర్ణ ఆరోగ్యమును మెరుగు పరచుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఉన్నత లక్షలను చేరాలని తెలిపారు . ఈ యోగ కార్యక్రమంలో అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య,  పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్,  జి.ఎం.  కార్యాలయ సిబ్భంది శిక్షకురాలు శ్రీమతి దేవేంద్ర యోగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ; ఏఐఎస్ఎఫ్

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ; ఏఐఎస్ఎఫ్



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21  (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని ప్రభుత్వ ప్రాధమిక,ప్రాధమికోన్నత,ఉన్నత పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని,మెరుగైన వసతులు కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో  బుధవారం నాడు రెబ్బెన  మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు  ధర్నా చేపట్టడం జరిగింది.అనంతరం కార్యాలయంలోని ఇంచార్జి కృష్ణా కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ లు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకోన్న సమస్యల పై ధర్నా కార్యక్రమాలు నిర్వించడంలో భాగంగా రెబ్బెన లో కూడా నిర్వహించడం జరిగిందని,విద్య సంవత్సరం ప్రారంభమయ్యి నేటికీ రోజులు గడుస్తున్నా విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందలేదని అన్నారు.అదే విధంగా ప్రతి పాఠశాలల్లో కనీస వసతులు అయిన త్రాగు నీరు,మరుగుదొడ్లు వసతి విధిగా కల్పించాలని డిమాండ్ చేశారు.మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించాలని,నాణ్యమైన,రుచికరమైన భోజనాన్ని అందించాలని అన్నారు.ప్రతి తరగతికి ఒక్క ఉపాధ్యాయున్ని కేటాయించాలని,ప్రతి తరగతి  గదిలో వెలుతురు,గాలి(FAN) సౌకర్యాలు కల్పించాలని,పూర్తి  స్థాయిలో పాఠ్య పుస్తకాలను అందించాలని,అన్ని పాఠశాలలకు క్రీడా మైదానాలు,ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు.విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మలిశెట్టి మహిపాల్,నాయకులు జెటంగుల సంజయ్,సాయి అంజన్న,దేవేందర్,కట్ల సాయి,రావుజీ తదితరులు పాల్గొన్నారు.

“ చేయూత “ తో జిల్లా హోం గార్డ్స్ కు సహయత ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 “ చేయూత “ తో జిల్లా హోం గార్డ్స్ కు  సహయత ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21  (వుదయం ప్రతినిధి); “చేయూత” కార్యక్రమము ద్వారా జిల్లా లోని హోo గార్డ్స్ కు లబ్ది ను పొందుతున్నారని, వారి యొక్క సేవల గుర్తించి వారికీ సముచిత స్థానం ను కలిస్తామని , వారి జీవన ప్రమాణాలను పెంచేలా మున్ముందు అబివృద్ది కార్యక్రమాలు వారికోసం చేపడతాము అని ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.   బుధవారం   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యాలయంలో  హోంగార్డ్ “చేయూత” కార్యక్రమమును ఏర్పాటు చేసరు.  ప్రమాదవశతూ మరణించిన హోంగార్డ్ కుమ్రం బీకాజి యొక్క కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం క్రింద 68,800/- రూపాయల చెక్కును అందచేశారు మరియు కుటుంబం లో అర్హతలు కలిగిన వారికీ ఉద్యోగం కలిపించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి హామీఇచ్చారు. అంతేకాక జిల్లా పోలీసులు సమాజం లొ నెలకొని వుండే రుగ్మత ల పైన కూడా పోలీసులు ద్రుష్టి కేంద్రికరించేలా ప్రణాలికలను సిద్దం చేసి కార్యోన్ముకులను  చేస్తామని ప్రజాసంబంధ కార్యక్రమాలు ద్వారా పోలిసుల యొక్క ఆత్మస్థైర్యం పెరగుతుందని  సమాజం లో నూతన ఉత్సాహం తో పోలీసులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు ,తద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమము లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్,శ్యాం సుందర్, ఎస్పిసీసీ శ్రినివాస్, హోం గార్డ్ ఆర్.ఐ అనిల్ కుమార్, హోo గార్డ్ డ్యూటీ మేజర్ వాజిద్అహ్మద్ ఖాన్ ,అవినాష్, హోం గార్డ్స్ లు దుర్గ ప్రసాద్ ,దీపక్ ,విష్ణువర్ధన్ ,జ్ఞానేశ్వర్ , క్యాంపు కార్యాలయ సిబ్బంది జి.కిరణ్ కుమార్ , వామన్ ,పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు  .

హోం గార్డ్ ఆర్.ఐ ..కోట్ – J.అనిల్ కుమార్.
జిల్లా లోని ప్రధాన పోలీసు అధికారి సన్ ప్రీత్ సింగ్ గారు హోంగార్డ్ సిబ్బంది సంక్షేమము కై ప్రారంబించిన " చేయూత " హోం గార్డ్ లకు వరం లాంటిది , ఇటువంటి ఆర్థిక సహకారం వల్ల హోం గార్డ్ లకు ,వారి కుటుంబాలకు స్వాంతన చేకూరుతుంది 
హోం గార్డ్ – కోట్ – దీపక్.

జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ దయ వల్ల ఏ జిల్లా లొ కూడా లేని విదముగా హోం గార్డ్ సంక్షేమ కార్యక్రమాలు కుమరం భీమ్ జిల్లా లొ అమలు అవుతున్నాయి,మా యొక్క సమస్యలను జిల్లా ఎస్పి గారి తో నేరు గా చెప్పుకునే సౌకర్యం కలిపించిన జిల్లా ఎస్పి గారికి మా యొక్క దన్యవాదములు.  

HURRY HURRY LAST CHANCE

HURRY HURRY    LAST CHANCE
2016-2017 BATCH D.ed  ADMISSIONS
. FEES   40,000 FOR 2 YEARS               CONTACT; 9866062012

Tuesday, 20 June 2017

బెల్లంపెల్లి ఏరియాలో కనిపించని సమ్మె ప్రభావం ; జి యం రవిశంకర్

 బెల్లంపెల్లి ఏరియాలో కనిపించని సమ్మె ప్రభావం  ; జి యం రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20  (వుదయం ప్రతినిధి);  జాతీయ కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యాగాలు  పిలుపుమేరకు చేపట్టిన సమ్మెలో కార్మికులు విధులను  నిర్వహించి  బొగ్గు ఉత్పత్తిని సాధించారని బెల్లంపల్లి ఏరియా జి యం. కె రవిశంకర్ అన్నారు. మంగళవారం రెబ్బన మండలలోని గోలేటి జీఎం కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారసత్వ ఉద్యోగులపై గత 5 రోజులుగా జరుగుతున్నా కార్మికుల నిరవధిక సమ్మె ప్రభావం రోజురోజుకు  హాజరు శాతం పెరిగింది అని తలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 11శాతం సాధించిందని, బొగ్గు రవాణాలో 7శాతం  ఏరియాలోని కార్మికులు  ఎలాంటి ఆటంకం లేకుండా విధులకు హాజరు అయ్యారు అని తెలిపారు. బెల్లంపెల్లి ఏరియాలోని గనులలో కార్మికులు విధులకు హాజరై  నిర్దేశించిన లక్షాన్ని సాదించారని తెలిపారు. మిగితా కార్మికులు కూడా విధులలో హాజరై తమ జితబథ్యాలు నష్ట పోకుండా సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ సమావేశం లో ఎస్ ఓ టు జిఎం కొండయ్య డీ జి ఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీతాల పెంపుపై హర్షాతిరేకం

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీతాల పెంపుపై హర్షాతిరేకం 



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20  (వుదయం ప్రతినిధి); కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జీత భత్యాలు పెంచడంతో మంగళవారం రెబెన్న కళాశాల ఒప్పంద అధ్యాపకులు  హర్షం వ్యక్తం చెసి  మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా రెబ్బెన కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ మినిమమ్ బేసిక్  మూలవేతనం పెంచుతూ జీవో నెంబర్ 162ను విడుదల చేయడం పట్ల  ఈ జీతం పెంచడం వలన జిల్లాలోని 123 కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రయోజనం కలుగుతుంది . పై  బేసిక్  రావడానికి కృషి చేసిన జిల్లాలోని అన్ని విద్యార్ధి సంఘాలకు, పార్టీలకు , సమ్మెకాలాలో సహకరించిన నాయకులకు, ప్రింటు మీడియాకు మరియు మాకు జీవో రావడానికి కృషి చేసిన మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావులు, ఎం ఎల్ సి లు పాతూరి సుధాకర్ రెడ్డి,పల్లె రాజేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా కూడా మాకు కొన్ని సమస్యలు మమ్ముల్ని కోర్టు సెలక్షన్స్ నుంచి బయటపడేసి మమ్ముల్ని త్వరగా రెగ్యులర్ చేయాలి,మహిళా ఉద్యగులకు మెటర్నిట్  సెలవులు  మంజూరు చేయాలి ,రెగ్యులర్ ఉద్యొగుల మాదిరిగా 24 క్యాజువల్ లీవులు ఇవ్వాలి ,రెగ్యులజేషన్ ఆలస్యమైతే వెంటనే మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలి . ఈ సమావేశంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు బి గంగాధర్, శ్రీనివాస్, ప్రకాష్,ప్రవీణ్,అమరేందర్, వెంకటేష్ మరియు రామారావు, వెంకటేశ్వరీ, మంజుల, నిర్మల,సుమలత,దీప్తి,జాన్సీమని , వరలక్ష్మి, మల్లేశ్వరి,సంధ్య మరియు తదితరులు.పాల్గొన్నారు. 

వారసత్వ ఉద్యోగాల సాధనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ; ఆత్రం సక్కు

వారసత్వ ఉద్యోగాల సాధనకు  కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ;  ఆత్రం సక్కు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20  (వుదయం ప్రతినిధి);  సింగరేణిలో  వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన నిరవధిక సమ్మెకు  కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్తి మద్దతును ప్రకటిస్తూన్నామని టిపీసీసీ కార్యదర్శి ఆత్రం సక్కు,డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ అన్నారు.మంగళవారం రోజున రెబ్బెన మండలం  గోలేటి టౌన్ షిప్ లోని కేఎల్ మహేంద్ర భవన్ జాతీయ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి  హాజరయ్యి వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులను మభ్యపెడుతున్నారని అన్నారు.సింగరేణిలోనే కాకుండా తెలంగాణ స్వరాష్ట్రంలో అవినీతి,అక్రమాలు పెరిగాయని,తెరాస పాలకులు భూ దందాలు, పోటీ పరీక్షలలో పైరవీలకు ముఖ్యమంత్రి వత్తాసు పలుకుతున్నారని ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిచారు.టిబిజికెఎస్ వారసత్వ  ఉద్యోగాలను కల్పించకపోవడమే కాకుండా,వారసత్వాల కోసం జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను విచ్చిన్నం చేసి మారో సారి కార్మికులను మోసం చేసిందని దుయ్యబట్టారు.దీనిని కార్మికులు గుర్తుపెట్టుకొని టిబిజికెఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.అవగాహనా లోపం,కార్మిక చట్టాలుం తెలియని ప్రాంతీయ సంఘాలను సింగరేణిలో పాతరవేయాలని అన్నారు.కార్మికులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెలో స్వచ్చందoగా సమ్మెలో పాల్గొనాలని కార్మికులను వారు కోరారు.అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించిన సక్కు,విశ్వప్రసాద్,ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,ఐఎన్టియూసీ నాయకులూ ముచ్చర్ల మల్లయ్యలను పోలీసులు అడ్డుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ,సిపిఐ,కాంగ్రెస్ నాయకులూ జూపాక రాజేష్,సత్యనారాయణ,బిక్షుమయ్య,నంబాల ఎంపీటీసీ సభ్యులు కొవ్వూరి శ్రీనివాస్,ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్,గాజుల రవీందర్,ముంజం రవీందర్,చంద్రశేఖర్,ఉపేందర్,రవీందర్,పూదరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.  

Monday, 19 June 2017

ఆర్జీల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి ; జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్

ఆర్జీల ద్వారా వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి ; జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్  ప్రీత్ సింగ్  

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);జిల్లా కేంద్రములోని పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సన్ ప్రీత్ సింగ్   ప్రజా ఫిర్యాదుల విభాగంను నిర్వహించి  ప్రజల నుండి వారి యొక్క సమస్యలను ఆర్జీల ద్వారా అందుకున్నారు.ఫిర్యాదు దారుల  సమస్యల పైన జిల్లా పోలీస్ ఉన్నతాధికారి  స్పందిస్తూ ఆయా పరిధి లోని అధికారులతో చరవాణిలొ మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకొని వాటిని  సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్బoగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజల కు నమ్మకం కలిగేలా,జవాబుదారిగా పని చేయాలని,కేసుల పురోగతి ను వెంట వెంటనే సీసీటీఎన్ఎస్ లో  నిక్షిప్తం చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.ప్రజా సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం  ఇవ్వాలని  జిల్లా లోని మారుమూల గ్రామల అభివృద్ధి కు వారి సంక్షేమముకు ప్రణాళిక బద్దంగా,వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ,వారి పిల్లలను పాఠశాలల,ఆశ్రమ పారశాలలకు పంపేలా చూడాలని,విడతల వారిగా గ్రామాలలో నెలకొని వున్నసమస్యలను తన ద్రుష్టికి  తీసుకురావాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  ఎస్బి సీఐ వెంకటేశ్వరులు,డిసీబీ ఎసై రాణాప్రతాప్,అసిఫాబాద్ టౌన్ సీఐ సతీశ్,ఎస్పి సీసీ శ్రీనివాస్,అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రహ్లాద్,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్,ఐటి  కోర్  శ్రీనివాస్,పిఆర్ఓ మనోహర్,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యను పరిష్కరించాలని తహశీల్ధార్ కు వినతి

భూ  సమస్యను పరిష్కరించాలని  తహశీల్ధార్ కు వినతి 
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి గ్రామా పంచాయతీ పరిధిలోని రేకులగూడెం ప్రజలు సోమవారం రోజున తహశీల్దార్ బండారి రమేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.గూడెం లో నెలకొన్న భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.గత 40 సంవత్సరముల నుండి కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ,కాలనీ లోకి  వచ్చే రహదారిని,ఇంటి ఆవరణ ప్రాంతాలని అదే కాలనీ కి చెందిన మల్లు భాయి  అనే మహిళా భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయారు.దీని పై స్పందించిన తహశీల్ధార్ మాట్లాడుతూ సమస్యను పరిశీలించి రెవిన్యూ సిబ్భంర్థిని విచారణకు ఆదేశించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు చింతకుంట్ల నారాయణ,రాయిళ్ల నర్సయ్య,భూర్స బుచ్చయ్యలు పాల్గొన్నారు.

కొమురవెల్లిలో మల్లన్నస్వామీ లింగా ప్రతిష్టాపన

కొమురవెల్లిలో మల్లన్నస్వామీ లింగా ప్రతిష్టాపన   
    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని కొమురవెల్లి గ్రామంలో శ్రీ మల్లన్న  స్వామి దేవస్థానంలో  సోమవారం రోజున వేద పండితులు దుద్దిళ్ళ మనోహర్ శర్మ ఆధ్వర్యంలో లింగా ప్రతిష్టాపన చేశారు.గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంఘ జరుగుతున్న హోమ కార్యక్రమాలకు  భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొని తిలకించి స్వామివారి అన్న ప్రసాదాలను తిలకించారు.ఈ కార్యక్రమంలో దురిశెట్టి ప్రభాకర్,శెంకర్,నారాయణ,విట్టల్,గ్రామస్థులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అంకితబావం తో పని చేస్తేనే సమాజం లొ గుర్తింపు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

అంకితబావం తో పని చేస్తేనే సమాజం లొ గుర్తింపు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);  పోలీసులు విద్ధి నిర్వహణలో చిత్తఃశుద్ధి  తో ,అంకిత బావం ,సేవతత్పరత  ల తో శాంతి భద్రతలను పరిరక్షించాలని ,జిల్లా పోలీసులు అన్నిటా ఆదర్శం గా,మార్గనిర్దేశకులు గా నిలవాలని అందుకు జిల్లా అధికారుల నుంచి ఏళ్ళ వేళల సహాయ సహకారాలు ఉంటాయి అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు ఈ సందర్బంగా  ఆసిఫాబాద్ జిల్లా  లోని హెడ్ క్వార్టర్స్ లొ  హెడ్ కానిస్టేబుల్  పని చేస్తున్న జాదవ్ గబ్బర్ సింగ్  ను జిల్లా ఎస్పి గారు గౌరవచిహ్నం అయిన పదోన్నతి  చిహ్నం అలంకరించి శాలువ తో సత్కరించి అబినందిచారు.ఇక పైన కూడా రెట్టింపు ఆత్మ విశ్వాసం తో, నూతన ఉత్తేజం తో శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు.

విద్యార్థుల హక్కులకై పోరాడుతాం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


విద్యార్థుల హక్కులకై పోరాడుతాం ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);   పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో పోరాటాలు చేస్తామని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు. ఎఐఎస్ఏఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రోజున రెబ్బెనలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్వే నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు తిష్ట వేసుకొని ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరిస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వత్తాసు పలుకుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వలన క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాలలు మూసివేతకు గురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు,ప్రహరీ గోడ,మంచినీటి సౌకర్యం తదితర సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరని అన్నారు. విద్య సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న నేటికీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని, అలాగే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి, నాయకులు అంజన్న ,సాయి తదితరులు పాల్గొన్నారు.

గీత కార్మికులను ఆదుకోవాలని పాలనాధికారికి వినతి

గీత కార్మికులను ఆదుకోవాలని పాలనాధికారికి  వినతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి);   జిల్లాలోని  గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారంనాడు గ్రివెన్స్ సందర్బంగా తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో జిల్లా పాలనాధికారి  చంపాలాల్ కు వినతి పత్రం సమర్పించాలి. రాష్ట కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్థుల్లో నిరుపేదలు ఉన్నారని వారు రోజువారీ కళ్ళు గీత పనియే తప్ప మరో ఉపాధి లేక గీత పనిలో లాభం లేక దుర్భరమైన జీవనం కొనసాగిస్తున్నారని,యాబై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క గీత కార్మికునికి వెయ్యి రూపాయల ఫించను అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో,బీజేపీ రాష్ట కార్యవర్గ సబ్యులు బోనగిరి సతీష్ బాబు,బిజవైేయం జిల్లా అధ్యక్షులు జుమిడి రాజేష్ లు పాల్గొన్నారు. 

పాత్రికేయులకు సంక్షేమ పధకాలను అమలు పర్చాలి


పాత్రికేయులకు సంక్షేమ పధకాలను అమలు పర్చాలి 
   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 (వుదయం ప్రతినిధి); కొమురం భీం అసిఫాబాద్ జిల్లా లో పని చేస్తున్న  వర్కింగ్ జర్నలిస్టులకు జాప్యం చేయకుండా వెంటనే అక్రిడియేషన్,ఆరోగ్య  కార్డులు జారిచేయలని,శాశ్వత  డీపీఆర్ఓ ను వెంటనే నియమించి పాత్రికేయులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు టీయూడబ్ల్యుజె (ఐజెయూ) జిల్లా శాఖా ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారి  చంపలాల్ కు  వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా టీయూడబ్ల్యుజె (ఐజెయూ) జిల్లా కన్వీనర్ అబ్దుల్ రహేమాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని  అన్ని జిల్లాలలో అక్రిడియేషన్,ఆరొగ్య కార్డులు జారీ అయ్యాయని,కానీ  ఇప్పటివరకు కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో జారీ కాకపోవడం  చాలా దారుణం అన్నారు.ప్రతి ఒక్క పాత్రికేయునికి  ఇంటి స్థలాలు ఇచ్చి రెండు పడకల  ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని పాత్రికేయులు  చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన పాలనాధికారి చరవాణిలో   ఇంచార్జి డిపిఅర్ఓ తో  మాట్లాడి మూడు రోజుల్లో అక్రీడీయేషన్,ఆరోగ్య  కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అక్రిడియేషన్ కమిటీ కో కన్వినర్ వేణుగోపాల్,సభ్యులు ప్రకాష్ గౌడ్,సదానంద బెంబ్రె,రాజు,రమేష్,వెంకన్న,జానకిరామ్,మిలిన్,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Sunday, 18 June 2017

కొండపల్లి లో జరిగిన హత్యా కేసులో ఇద్దరు అరెస్ట్

కొండపల్లి లో  జరిగిన హత్యా కేసులో ఇద్దరు అరెస్ట్ 



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18  (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామంలో ఈ నెల 12 న జరిగిన గుర్లె  గణపతి (46) హత్యా కేసులో రెబ్బెన పొలిసులు చేరవాణి ఆధారం చేసుకుని నిందుతులని కస్టడీ లోనికి తీసుకుంట్ల సి ఐ మదన్ లాల్ తెలిపారు. ఆదివారం రెబ్బెన   పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలా  తెలిపిన వివరాల ప్రకారం కొండపెల్లికి చెందిన గుర్లె గణపతి(46) కి సుశీల (38) తో గత 20సవంత్సరాల క్రితం వివాహం అయింది కొంతకాలం వారి సంసారం సజావుగానే సాగినప్పటికి ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం గణపతి చేడు వ్యసనాలకు బానిసై ఖర్చుల కోసం 3ఎకరాల భూమి తో పాటు 2ఆటోలను అముకున్నాడు. అనంతరం కాగజ్ నగర్  ఎక్స్ రోడ్ లో  ట్రాక్టర్ యజమాని వద్ద  సూపర్ వైసర్ గా 7000 జీతానికి విధులు నిర్వాసిస్తూ రాత్రి వేళలో సైతం అక్కడే ఉండే వాడు అన్నారు. ఈ క్రమం లో అదే గ్రామానికి చెందిన మహమ్మద్ జాకిర్ అలీ (20) తో సుశీలకు పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది . భర్త వ్యసనాలకు ఉన్న ఆస్తులు మొత్తం అమ్మడం తో పాటు జాకిర్ తో ఏర్పడిన అక్రమ సంబంధం తో భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అందుకు గాను నిధితురాలు జాకిర్ సహాయం కోరింది దీనితో ప్రియుడు కాగజ్ నగర్ మౌనిక మెడికల్ నుండి ఏడు నిద్రమాత్రలు తీసుకు వచ్చి సుశీలకు ఇచ్చి వీటిని కూరలో కలిపి భర్తకు తినిపించాలని తిన్న అనంతరం  నిద్రమత్తులో ఉండగా చంపడం సులువుగా ఉంటుందని సలహా ఇచ్చాడు. ఈ  నెల 11న రాత్రి  వేళలో సుమారు 8;30 ప్రాంతం లో చికన్ కూర వండి భర్త కోసం వేరుగా తీసి నిద్రమాత్రలు కలిపి అన్నంలో  పెట్టడంతో అది తిన్న గణపతి గాఢనిద్రలోకి జారుకున్నాడు. అనంతరం తెల్లవారు జామున 2గంటల  ప్రాంతంలో భర్తను మెడపై గోడ్డలితో దారుణంగా నరికి చంపినట్టు సి ఐ మదన్ లాల్ తెలిపారు. మృతుడు తమ్ముడు గుర్లె బాబురావు ఇచ్చిన పిర్యాదు మేరకు విధులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వీరితోపాటు ప్రత్యేక పొలిసు బృందం శ్యామ్ రావు, రవీందర్, విజయలక్ష్మి, హోంగార్డ్ శ్రీనివాస్ లు  ఉన్నారు.