కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 ; రెబ్బన ; బస్సు సమయానికి రాక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఎఐఎస్ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి బుధవారం అన్నారు. రెబ్బెన మండలంలోని నంబాల పాఠశాలలో చదువుతున్న నారాయణపూర్, కిష్టాపూర్, జక్కుల పల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు వస్తున్నారని పాఠశాల ముగిసిన తర్వాత వారి ఇళ్లలోకి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బస్సు నాలుగు ముప్పైకి రావాల్సిన బస్సు రాత్రి ఎనిమిది గంటల తర్వాత వస్తున్నట్లు గమ్యం చేరడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తొమ్మిది గంటల వరకు బస్సు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో చేసిన విద్యార్థులు రాత్రి తొమ్మిది గంటల వరకు తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు చేయవలసిన హోంవర్కులు కూడా సరిగా చేయలేక చదువులో వెనక పడుతున్నారని, ప్రభుత్వం పిల్లలందరూ గవర్నమెంటు పాఠశాలల్లో చదవాలని అంటుండగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమయానికి బస్సు నడిపే విధంగా చేయాలని సుమారు ఎనభై మంది విద్యార్థులు బస్సులో వస్తారు ఒకవేళ బస్సు రాకపోతే ఆ విద్యార్థులు చదువుకు దూరమవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పూదరి అరుణ, సాయి, రవి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment