Thursday, 14 June 2018

జిల్లా లో ౩౦ పోలీస్ ఆక్ట్ అమలు

కుమ్రం భీమ్ జిల్లా లో  శాంతి భద్రతల దృష్ట్యా  మరియు జిల్లా లో ప్రశాంతత ను పెంపొందించేందుకు జిల్లా అంతటా ఈ నెల  11-06-2018 నుంచి వచ్చే నెల 10-07-2018  వరకు జిల్లా అంతటా  ౩౦ పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ  ౩౦ పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లా లో   సబ్  డివిజనల్ పోలీస్  అధికారి  లేదా పోలీస్  ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా  ఎటువంటి  పబ్లిక్ మీటింగ్ లు , ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు.

1)        నిషేదిత ఆయుధములు  అయిన కత్తులు ,చాకులు , కర్రలు , జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు , ప్రేలుడు పదార్థములు , మరియు నేరమునకు పురిగోల్పే ఎటువంటి ఆయుదములను వాడరాదు.

2)       ప్రజలకు  ఇబ్బంది , చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం .

3)       రాళ్ళను  జమ చేయుట  మరియు దరించి సంచరించుట వంటివి నిషేధం.

4)       లౌడ్ స్పీకర్ లు , DJ లు వంటివి కూడా ఈ సమయం లో  నిషేధము  మరియు  పబ్లిక్ అడ్రసింగ్ కోసం వాడు ప్రచార రథములు  మైకులు మరియు దాని యొక్క  అనుబంధ పరికరములు అన్ని కూడా నిషేధించబడినవి.



ఇందుమూలంగా జిల్లా ప్రజలకు తెలియపరిచడం ఏమనగా పైన తెలిపిన నియమాలు ఎవరైనా ఉల్లంగించిన ౩౦ పోలీస్ ఆక్ట్ 1861  కింద  శిక్షార్హులు అగుదురు.



పైన తెలిపిన నియమ నిబంధనలు ఈ క్రింది వారికి మినహాయింపు వర్తించును

1)        విధి నిర్వహణలో  పోలీస్ లకు

2)       మిలిటరీ అధికారులకు

3)       విధి నిర్వహణ లో వున్న హెం గార్డ్స్ కు

4)       అంత్య క్రియ ఊరేగింపులకు



 ౩౦ పోలీస్ ఆక్ట్ 1861 అమలులో  ఉన్నందున జిల్లా ప్రజలందరు  ప్రశాంతత ను పెంచేందుకు పోలీస్ అధికారులకు సహకరించగలరని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ కోరారు.



          పోలీస్ కొలువు కోసం  ఉచిత శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 14  ; రెబ్బెన:  ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలను సాదించేందుకు  కొమరం భీం జిల్లా పోలీసుల అధ్వర్యములో  ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు  రెబ్బెన మరియు తిర్యాణి మండలాల నుండి  అనూహ్యంగా 285 మంది  అభ్యర్థులు తమ  ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో  ఉదయము 5 గ: గంటలకు రెబ్బెనా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ వద్దకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు  ఫీజికల్ మేజర్ మెంట్స్  కై   హాజరు అయినట్లు  ఏఎస్పి గొద్రు,డిఎస్పి  సత్యనారాయణ తెలిపారు.అంతరం వారు మాట్లాడుతు పోలీస్ శిక్షణ కై హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువ పత్రాలు పరిశీలించి వారి యొక్క ఎత్తును నమోదు చేశామన్నారు.ఈ యొక్క ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుషులు మరియు తిర్యాణి మండల కేంద్రం నుండి 24 మంది మహిళలు,69 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ ఫ్రీ సెలెక్స్టీన్ సందర్బంగా రెబ్బెన సీఐ పురుషోత్తమ చారి, రెబ్బెన ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు





పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను అనూహ్య స్పందన.    


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 14  ;  ప్రభుత్వం ప్రకటించిన పోలీసు కొలువును సాధించేందుకు కొమురంభీం జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు అర్హులైన జిల్లా అభ్యర్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రేమళ గార్డెన్లో  నిర్వహించిన ప్రీ సెలక్షన్ టెస్ట్ ను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు.ఈ సందర్బంగా  హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించి  ఎత్తును నమోదు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎన్నో వ్యయ ప్రాసలతో  కూడుకున్నదని అందుకొరకే జిల్లాలో ఉన్న అభ్యర్థుల కొరకు ఉచిత శిక్షణను ప్రారంభించడం జరిగిందన్నారు.  అంతేకాక ఉచిత శిక్షణకు జిల్లాలోని అభ్యర్థుల నుండి అనూహ్య  స్పందన లభించిందని అన్నారు గురువారం మండలాల వారీగా ప్రారంభించిన ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుష అభ్యర్థులు,ఆసిఫాబాద్ నుండి 22 మంది మహిళా అభ్యర్థులు 114 మంది పురుష అభ్యర్థులు, వాంకిడి మండలం నుండి 17 మంది మహిళా అభ్యర్థులు 75 మంది  పురుష అభ్యర్థులు తిర్యాని మండలం నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు ,69  మంది పురుష అభ్యర్థులు పాల్గొన్నారని  అన్నారు.  సమయానుసారం  ప్రకారం పాల్గొనలేకపోయిన అభ్యర్థులు 18-06-2018 సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ నందు  హాజరు కావచ్చునని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.  శిక్షణకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలను జిల్లాలోని కాగజ్నగర్ ఆసిపాబాద్ మరియు జైనూర్ లలో  ఏర్పాటు చేయడంజరుగుతున్నదని వీటితో  పాటుగా ఫిజికల్ ఇవెంట్స్ కొరకు ఒక జత షూ  మరియు రెండు జతల  స్పోర్ట్స్ దుస్తులను అందించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, బాలాజీ వరప్రసాద్, ఆర్ఐలు సంతోష్,శేఖర్ బాబు, చంద్రశేఖర్, వాంకిడి ఎస్ఐ ముస్క రాజు, డిపిఓ సుపరిడెంట్  సతీష్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, పిడిలు ఊషన్న, హేమంత్, శెంకర్ తదితరు పాల్గొన్నారు.

No comments:

Post a Comment