Saturday, 16 June 2018

సంప్రదాయబద్ధంగా ఈద్ ఉల్ ఫితర్



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 రెబ్బెన: పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా రెబ్బెన మండల కేంద్రం లో పండుగ వాతవరణం కనిపించింది.ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పవిత్ర ఈద్గా వద్దకు చేరుకొని విశ్వ మానవాళి క్షేమాన్ని కోరుతు  ప్రార్ధనలు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. పవిత్ర రంజాన్‌  పర్వదినాన్ని పురస్కరించుకొని చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ ఏ సందర్బంగా ప్రార్ధనలకై తరలి వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈద్గా  వద్ద ప్రత్యేక  ఏర్పాట్లు చేసారు.ప్రార్థనల అనంతరం బంధువులను,స్నేహితులను మతాలకతీతంగా ముస్లిం సోదరులు ఆలింగనము చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా రెబ్బన ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గా వద్దకు వెళ్లి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  రెబ్బెన ఎస్సైశివకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తును ఏర్పాటు చేసి  పర్యవేక్షించారు.   

No comments:

Post a Comment