Thursday, 7 June 2018

భగీరథ పైపులైన్ పగిలి ఎగిసిపడిన నీరు ; ప్రయాణికులు కొంతసేపు బయాందోళన



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 7  రెబ్బెన మండల కేంద్రంలోని కగజనగర్ క్రాస్ రోడ్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు విద్యుత్ తీగలు తాకుతు బారి ఎత్తున ఎగిసి పడ్డాయి.విద్యుత్ తీగలను తాకుతు  ఎగిసిపడిన నీటిని చూసి ప్రయాణికులు కొంతసేపు బయాందోళనలకు గురయ్యారు. 
భగీరథ  ట్రయల్ రన్నును వాడా ప్రాజెక్టు నుంచి బెల్లంపలి వరకు గురువారం ట్రయల్ రన్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా   కాగాజెనగర్ ఎక్స్ రోడ్డు  వద్ద భగీరథ పైపులైన్ పైపుకు పైపుకు మధ్యలో ఉన్న గ్యాస్ కిట్  లీకేజీ వల్ల సుమారు పదిమీటర్ల ఎత్తుతో నీళ్లు ఉప్పొంగి జాతీయ రహదారికి ఇరువైపులా వెళ్తున్న వాహనాలకు
 
అంతరాయం ఏర్పడింది దీన్నికి సంబంధించిన అధికారులు హుటా హుటిన దగ్గరలో ఉన్న పంప్ లైన్  హాజ్  సహాయంతో   నీటిని అరికట్టారు. అదే విధంగా నీటిని ట్రైల్  రన్లో భాగంగా శుక్రవారం కూడా టెస్టింగ్ కోసం నీటిని భగీరథ పైపుల ద్వారా వదలనున్నట్లు  ఇఇ వెంకటరమణ తెలిపారు.
భగీరథ పనులను డి ఇ గాజుల వెంకటేశ్, నాగేశ్వర్ రావు పని ప్రదేశాలను సందర్శించారు.

No comments:

Post a Comment