Saturday, 30 June 2018

రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 ;  రెబ్బన ; రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి  వేతన సదుపాయం కలిపించాలని రేషన్ డీలర్ల సంగం మండలాధ్యక్షుడు ఎస్  రామయ్య అన్నారు.  మండల కేంద్రం లో తహశీల్దార్ కార్యాలయం ముందు శెనివారం  రేషన్ డీలర్లు ఒక్క రోజు దీక్ష కార్యాచరణ చేపట్టారు .ఈ సందర్బంగా  మాట్లాడుతు చాలి చాలని కమిషన్లతో కాలాన్ని వెళ్లదీస్తున్నామని , రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ  ప్రభుత్వాము పట్టించుకోవడం లేదన్నారు. డీలర్ల న్యాయమైన  సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  రేషన్ డీలర్లకు వేతన సదుపాయం కలిపించాలని అన్నారు. పలు పార్టీల నాయకులు రేషన్ డీలర్ల దీక్ష శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపారు.అనంతరం రేషన్ డీలర్లు తహశీల్దార్ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ ధీక్షలో జి  బాపు,జె శెంకర్ లాల్,వి రాజమణి,ఎల్ గోపాల్,వి నిర్మల,కె శెంకర్, జి జానకి రామ్,జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.     

No comments:

Post a Comment