కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 రెబ్బన;; ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం ను నీరుకార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు కుట్రపన్నారని అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకునే భాద్యత మనందరి మీద ఉందని , ఎమ్మార్పీఎస్ ర్రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాదిగ అన్నారు .గురువారం రెబ్బన అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జులై 17 న చలోఢిల్లీ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలు ఏకమై చట్టాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రభాకర్ మాదిగ జిల్లా కార్యదర్శి నాగరాజు మాదిగ ఎం ఆర్ పి ఎస్ నాయకులు బొంగు నర సింగ్ రావు తదతరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment