కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కెసిఆర్ సేవాదళ్ లక్ష్యం అని కెసిఆర్ సేవాదళ్ అధ్యక్షులు మహమ్మద్ షోయాన్ అన్నారు. ఏప్రిల్ 15 న హైదరాబాద్ లో సైకిల్ యాత్ర ప్రారంభించి 11 రాష్ట్రాలలో సుమారు 5500 కిలోమీటర్లు ప్రయాణించి మంగళవారం రెబ్బెన చేరుకున్నరు. ఈ సందర్భంగా స్థానిక ఆతిధీ గృహ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల అమలు, వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లే క్రమంలో తెరాస నాయకుల కృష్ణి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడమే సేవాదళ్ ముఖోయద్దేశమని అన్నారు. రాబోయే కాలంలో కెసిఆర్ దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షులు ఉబేద్ బిన్ యాహియా, జిల్లా ఉపాధ్యక్షులు కొట్నాక కిషన్ రావు, నియోజకవర్గ అధ్యక్షులు భూక్యారాజు, రెబ్బెన స్థానిక నాయకులూ జడ్పీటీసీ బాబు రావు,రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment