రైతులు పల్లికాయల విత్తనాల కోసం ఆందోళన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26 ; రెబ్బన ; కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పథకంలో రైతులకు పట్టాపాస్ పుస్తకాలపై 20 కిలోల పల్లికాయల పంపిణిని సోమవారం రెబ్బెన మండల వ్యవసాయ కేంద్రంలో పంపిణి చేసారు. మంగళవారం మండలం లోని రైతులు సహకార సంఘానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో రైతులు చేరుకోగా పంపిణీకి సరిపడా విత్తనాల సరుకు లేదని సంబంధిత అధికారులు రైతులకు తెలపగా ఆందోళనకు దిగరు. ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, సహకార సంఘం చైర్మన్ గాజుల రవి, రెబ్బెన ఎస్సై శివకుమార్ లు సర్ది చేప్పిరు. మండలంలో వేల సంఖ్యలో రైతులు ఉండగా కేవలం 350 బ్యాగులు పంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఏవో మంజుల ను వివరణ కోరగా నిరుపేద రైతులకోసం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పథకంలో రైతులకు పట్టాపాస్ పుస్తకాలపై 20 కిలోల పల్లికాయల విత్తనాలను రెబ్బెన మండలానికి 350 బ్యాగుల పల్లికాయ విత్తనాలు వచ్చాయని, వీటిని సోమవారము సుమారు 40 బస్తాలు రైతులుకు పంపిణి చేశామని, మిగతా వాటిని గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్ది దారులకు పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ఒకేసారి మండలంలోని రైతులందరూ రావడంతో లబ్దిదారులను ఎంపిక చేయటంలో ఇబ్బంది ఉందని కావున పల్లికాయల విత్తన పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment