Friday, 15 June 2018

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు తెరాస నాయకుడు నవీన్ జైశ్వాల్ ఇఫ్తార్ విందు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 15
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం చేస్తున్న  ముస్లిం సోదరులకు శుక్రవారం రెబ్బెన మండలంలోని మసీదులొ  తెరాస నాయకుడు నవీన్ జైశ్వాల్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. వారితో పాటు కలిసి భోజనం చేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఉంటే సంతోషంగా ఉండొచ్చని అన్నారు.అందులో భాగంగానే పవిత్ర మాసంలో     ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పేద ముస్లిం పిల్లలకు స్వంత ఖర్చులతో రంజాన్ పండుగకు దుస్తులు అందజేశారు 

No comments:

Post a Comment