కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 15 ; రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామ సర్పంచ్ తోట లక్ష్మణ్ ను తెరాస పార్టీ నుంచి తొలగించినట్లు తెరాస పార్టీ మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గోలేటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్దీ కాలంగా సదరు సర్పంచ్ పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడుతుండటంతోఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎం ఎల్ సీ పురాణం సతీష్, ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి ల ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇక నుంచి ఆయనకు పార్టీ కి ఎలాంటి సంభందం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, టిబిజికె ఎస్ గోలేటి బ్రాంచ్ ఉప అధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment