ప్రజా ఫిర్యాదుల పట్ల జవాబుదారిగా వుండాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 : ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాద్యతయుతముగ వ్యవహరిస్తూ ఫిర్యాదు పురోగతిని పారదర్శకంగ ఫిర్యాదు దారులకు ఎప్పటికప్పుడు తెలపాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. స్థానిక జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో జిల్లా ఎస్పి సోమవారం నాడు ప్రజా ఫిర్యాదు ల విబాగం ను నిర్వహించారు ,ప్రజా ఫిర్యాదు విబాగం కు వచ్చిన మొత్తం 11 మంది ఫిర్యాదుధారుల యొక్క ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు ప్రజా ఫిర్యాదు విబాగం లో దుర్గం లక్ష్మి తండ్రిపేరు మల్లయ్య భారే గూడ మండలం కాగజ్ నగర్ , చల్లురి కమల భర్తపేరు రాజేశ్వర్ గోలేటి మండలం రెబ్బెన, దుర్గం తార భర్తపేరు రాములు కాగజ్ నగర్ లు తమ యొక్క తల్లి గారి ద్వారా సంక్రమించిన వారసత్వ భూమిపై పూర్తి హక్కులు కలిగివున్న తమను, అన్యులు తమ యొక్క భూమి ను ఖాళి చేయాలనీ బలవంతపు వత్తిడి కు లకు పాల్పడుతూ దుర్భాషలాడుతున్నారని దాడులకు దిగుతున్నారని జిల్లా ఎస్పిగారికి ఫిర్యాదు చేసి తమకు సహాయo అందేలా చర్యలు తిసుకువాలని విన్నవించుకున్నారు, సిర్పూర్ మండలం లోనేవెల్లి కు చెందిన గోమాసు వాసుదేవ్ తండ్రిపేరు గొండుజి లు తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసారు అని తగు విధం గా వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు, ఆత్రం గోవింద్ రావు ఆసిఫాబాద్ , మాండ్యపార్థు కౌటాల లాలూ తమతమ భూ సమస్యలను జిల్లా ఎస్పి కు వివరించారు. ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను సావదానం గా విన్న జిల్లా ఎస్పి తగు సూచనలతో సంబందిత అధికారులను తక్షణం న్యాయం జరిగేలా చర్యలను తీసుకోవాలని సంబందిత అధికారుల ను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదు కార్యక్రమము లో అడిషనల్ ఎస్పి అడ్మిన్ గోద్రు ,ఆసిఫాబాద్ డి ఎస్పి సత్యనారాయణ , ఎస్పి సీసీ దుర్గంశ్రీనివాస్ ,డిసిఅర్బి ఎస్సై రాణాప్రతాప్ , పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి ప్రహ్లాద్ , కేదార సూర్యకాంత్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , కరుణ , ఫిర్యాదుల విభాగం అధికారి సునీత , కిరణ్ కుమార్ లు మరియు లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment