Tuesday, 21 November 2017

ఓ డి ఎస్ నిధుల మంజూరులో చేతివాటం పై ఏపీఓ కు ఫిర్యాదు

ఓ డి ఎస్  నిధుల మంజూరులో చేతివాటం పై  ఏపీఓ కు ఫిర్యాదు    
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 :   రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలోని  మనలోని ఆర్ ఆర్ కాలనీకి చెందిన తొమ్మిది మంది మహిళలు తమ  వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి కేటాయించిన  నిధుల నుండి మూడు వేలు రూపాయలు  రెబ్బెన సర్పంచ్ మరియు పంచాయితీ కార్యదర్శి తీసుకున్నారని మంగళవారం ఎం పి  డి ఓ  ఆఫీసులో ఏ  పి  ఓ   కల్పనకు లిఖిత పూర్వకంగా  ఫిర్యాదు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద వారికి కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవడానికి శాంక్షన్ ఐన  పన్నెండు వేల రూపాయలలో మూడు వేల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు ఓ డి ఎఫ్ నిధుల నుండి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్లూరి పద్మ  గుండేటి  మల్లక్క, గుండు తార, గజ్జెల, ఆశవ్వ, కళావతి, శ్రీలత, బి విజయ, వి కమల,  మరియు  జిల్లా సిపిఐ నాయకులు    రామడుగుల శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జాడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment