Wednesday, 22 November 2017

పాత్రికేయులను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి ; అబ్దుల్ రహమాన్

పాత్రికేయులను అవమానించిన ఎమ్మెల్యేపై  చర్యలు తీసుకోవాలి ;  అబ్దుల్ రహమాన్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 22 :  పాత్రికేయులను  లను అవమానించిన మంచిర్యాల ఎమ్మెల్యే పై వెంటనే చర్యలు తీసుకోవాలని  టి యు డబ్లు  జే  (ఐ జే  యు ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ అన్నారు.  బుధవారం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లో  వూదయం ప్రతినిధితో మాట్లాడుతూ    ఎమ్మెల్యే మీడియా పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. వెంటనే  జర్నలిస్ట్ లకు  బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రోజు రోజు కు ఎమ్మెల్యే లు జార్నలిస్టుల ను కించపరిస్తూ అవమనిస్తున్నారు .ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.ముఖ్యమంత్రి కల్పించుకొని తమ పార్టీ ఎం ఎల్ ఏ  లను తగు విధంగా నియంత్రించాలని కోరారు. 

No comments:

Post a Comment