ఐ పి ఎస్ అధికారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 5 కే రన్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 23 :గురు కుల పాఠశాలల గౌరవ సెక్రెటరీ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐ పి ఎస్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అసిఫాబాద్ లో 5k రన్ కార్యక్రమాన్ని నెవెర్ గివ్ అప్ డే వేడుకల్లో భాగంగా 1200 మంది స్వేరో లతో కలెక్టరేట్ మీదుగా ,బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహం ముందు నుండి గిరిజన బాలికల గురుకుల పాఠశాల వరకు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన డి సీ ఓ సత్యనారాయణ,పి టి జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, స్వేరో జోనల్ సహాయ కార్యదర్శి హేమంత్ షిండే, జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య,ఉపాధ్యక్షులు ఆత్మ రాం, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ మహేష్,మారుతి, అసిఫాబాద్ మండల బాధ్యులు వెంకటేష్, కొల్లూరి శంకర్, ఉపాధ్యాయులు లకావత్ శంకర్, 1200 మంది జూనియర్ స్వేరో లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment