Monday, 27 November 2017

రెబ్బెన మండలం కిష్టాపూర్ లో జాక్ కమిటీ ఎన్నిక

రెబ్బెన మండలం కిష్టాపూర్ లో  జాక్ కమిటీ ఎన్నిక 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 :  రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామ  జాక్ నూతన  కమిటీని రెబ్బెన మండలం జాక్ చైర్మన్ మిట్టదేవధర్  ఆధ్వర్యంలో  ఎన్నుకోవడం జరిగిందని జాక్ జిల్లా కో కోర్డినేటర్ రాయిలా నరసయ్య  తెలిపారు. కిష్టాపూర్ గ్రామా జాక్ చైర్మన్గా కోతోడే  హరీష్ రెడ్డి, కన్వీనర్ గ సువర్కర్ ప్రహ్లాద్,కో చైర్మన్గా సువర్కర్ నాగరాజు, కో   కన్వీనర్ గ మామిడి తిరుమల, సభ్యులుగా శంకర్, రాకేష్, శ్రీనివాస్, వెంకటేష్  లను ఎన్నుకొన్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా జాక్ రైతుల, రైతుకూలీల, విద్యార్థుల, నిరుద్యోగుల  సమస్యలపై దృష్టి   పెట్టి, సకాలంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించేవిధంగా పనిచేయాలని అన్నారు. . ఈ సమావేశంలో దుర్గం మల్లయ్య, సంగం చందు,  ప్రేమ్కుమార్  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment