రెబ్బెన మండలం కిష్టాపూర్ లో జాక్ కమిటీ ఎన్నిక
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 : రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామ జాక్ నూతన కమిటీని రెబ్బెన మండలం జాక్ చైర్మన్ మిట్టదేవధర్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగిందని జాక్ జిల్లా కో కోర్డినేటర్ రాయిలా నరసయ్య తెలిపారు. కిష్టాపూర్ గ్రామా జాక్ చైర్మన్గా కోతోడే హరీష్ రెడ్డి, కన్వీనర్ గ సువర్కర్ ప్రహ్లాద్,కో చైర్మన్గా సువర్కర్ నాగరాజు, కో కన్వీనర్ గ మామిడి తిరుమల, సభ్యులుగా శంకర్, రాకేష్, శ్రీనివాస్, వెంకటేష్ లను ఎన్నుకొన్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా జాక్ రైతుల, రైతుకూలీల, విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి, సకాలంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించేవిధంగా పనిచేయాలని అన్నారు. . ఈ సమావేశంలో దుర్గం మల్లయ్య, సంగం చందు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment