సెర్ప్ ఉద్యోగుల వినూత్న నిరసన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 18 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు శనివారం అసిఫాబాద్లో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా జాక్ జిల్లా కన్వీనర్ మోహన్లాల్, కో కన్వీనర్ రమేష్, నాయకులూ రామకృష్ణ, అన్నాజీ, సుఖఃదేవ్,లు మాట్లాడుతూ ప్రభుతం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను సత్వరమేపరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోఉద్యోగులు రమేష్, సురేందర్, శ్రీదేవి, భీం రావు, శకుంతల, సంపత్, రాధ,శంకర్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment