Friday, 10 November 2017

పత్తి రైతు గుర్తింపు కార్డుల పంపిణి

    పత్తి రైతు గుర్తింపు కార్డుల పంపిణి 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 10 : రైతు గుర్తింపు కార్డుల పంపిణి  కార్యక్రమాన్ని శుక్రవారంనాడు రెబ్బెన మండలంలో ప్రారంభించారు.తెలంగాణ ప్రభుత్వం రైతు లకు అధిక ప్రాముఖ్యాన్ని ఇస్తున్నార ని, రైతులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రతి రైతుకు గుర్తింపుకార్డు ఇవ్వాలని ముఖ్య మంత్రి నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేవిధంగా ఈ రోజు గుర్తింపు కార్డుల పంపిణి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ   అజ్మీర  బాపురావు, ఎమ్ పీటీసీ  కర్నాధం సంజీవ్, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, వ్యవసాయాధికారిని మంజుల పాక్స్ చైర్మన్ ,మార్కెట్కమిటీ వైస్  చైర్మన్ కుందారపుశంకరమ్మ ,, డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ రావు, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అర్చన, సంతోష్ మరియు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment