మహిళాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : త్రిపురాన వెంకట రత్నం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 : మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు మంగళవారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమళ గార్డెన్లో జరిగిన మహిళా చట్టాల అవగాహన సదస్సులో జిల్లా పరిపాలనాధికారి ఎం చంపాలాల్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం పాల్గొని జ్యోతి ప్రజలన గావించారు అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రత్యేకించి ఈ జిల్లాకు చైర్మన్ వచ్చి మహిళా చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నందుకు మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చాయని ఆ చట్టాలను ఉపయోగించుకోలేక పోతున్నారని అన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా చైర్మన్ ని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు చైర్మన్ మాట్లాడుతూ మహిళల చట్టాల అవగాహన సదస్సు రెండు రోజుల పాటు కొనసాగుతుందని భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను కల్పిస్తుందని మహిళా రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఏవీ అమలులోకి రావడం లేదన్నారు వరకట్న నిషేధ చట్టం ఆస్తి బాల్యవివాహాలు ఇలా ఎన్నో ఉన్నప్పటికీ ఏవీ అమలు కావడం లేదన్నారు. గిరిజనంలో విద్య శాతం తక్కువగా ఉన్న చోట ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని మహిళలకు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా మహిళలకు సాధికారిత దిశగా ముందుకు పోలేకపోతున్నారు ఇప్పటికీ మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. ఉదాహరణకు సర్పంచ్లు జడ్పీటిసిలు ఎంపిటిసిలు మహిళలు ఉన్నప్పటికీ వారి స్థానంలో పురుషులు నిధులు నిర్వహిస్తున్నారు . వారికి కేటాయించిన స్థానంలో వారిని విధులు నిర్వహించుకునేలా చూడాలన్నారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మహిళలను గౌరవించేలా పెంచాలన్నారు ఆడా మగా తేడా లేకుండా ఇద్దర్నీ ఒకేలా సమానంగా పెంచాలని ఈ అవగాహన సదస్సులో ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి, హైకోర్టు న్యాయమూర్తి వేజెత, ఎంపిపి తారాబాయి, మహిళా సర్పంచులు డిఆర్డిఏ పిడి శంకర్ జిల్లా అధికారులు ఐసిడిఎస్ పిడి సావిత్రి సూపర్ వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 : మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు మంగళవారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమళ గార్డెన్లో జరిగిన మహిళా చట్టాల అవగాహన సదస్సులో జిల్లా పరిపాలనాధికారి ఎం చంపాలాల్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం పాల్గొని జ్యోతి ప్రజలన గావించారు అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రత్యేకించి ఈ జిల్లాకు చైర్మన్ వచ్చి మహిళా చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నందుకు మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చాయని ఆ చట్టాలను ఉపయోగించుకోలేక పోతున్నారని అన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా చైర్మన్ ని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు చైర్మన్ మాట్లాడుతూ మహిళల చట్టాల అవగాహన సదస్సు రెండు రోజుల పాటు కొనసాగుతుందని భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను కల్పిస్తుందని మహిళా రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఏవీ అమలులోకి రావడం లేదన్నారు వరకట్న నిషేధ చట్టం ఆస్తి బాల్యవివాహాలు ఇలా ఎన్నో ఉన్నప్పటికీ ఏవీ అమలు కావడం లేదన్నారు. గిరిజనంలో విద్య శాతం తక్కువగా ఉన్న చోట ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని మహిళలకు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా మహిళలకు సాధికారిత దిశగా ముందుకు పోలేకపోతున్నారు ఇప్పటికీ మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. ఉదాహరణకు సర్పంచ్లు జడ్పీటిసిలు ఎంపిటిసిలు మహిళలు ఉన్నప్పటికీ వారి స్థానంలో పురుషులు నిధులు నిర్వహిస్తున్నారు . వారికి కేటాయించిన స్థానంలో వారిని విధులు నిర్వహించుకునేలా చూడాలన్నారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మహిళలను గౌరవించేలా పెంచాలన్నారు ఆడా మగా తేడా లేకుండా ఇద్దర్నీ ఒకేలా సమానంగా పెంచాలని ఈ అవగాహన సదస్సులో ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి, హైకోర్టు న్యాయమూర్తి వేజెత, ఎంపిపి తారాబాయి, మహిళా సర్పంచులు డిఆర్డిఏ పిడి శంకర్ జిల్లా అధికారులు ఐసిడిఎస్ పిడి సావిత్రి సూపర్ వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment