Sunday, 19 November 2017

ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి వేడుకలు

ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి వేడుకలు 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 19 ;  భారత వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి సందర్భంగా ఆసిఫాబాద్‌ లో ఆదివారం  వసతీగృహములో ఏ.బీ.వీ.పీ జిల్లా కన్వీనర్ శ్రీ ఎలగతి సుచీత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా  ఝాన్సీ లక్ష్మీ బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం1857 మరియు  ఝాన్సీ లక్ష్మీ బాయి నానాసాహెబ్ పీష్వా తాంతియాతోపే లు ఆంగ్లేయులపై వీరోచితంగా పోరాటం చేయడం తో భారత్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనే అవకాశం వచ్చిందనీ అన్నారు. ఫలితమే 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం కాబట్టి ప్రతీ విద్యార్థి ఒక ఝాన్సీ లక్ష్మీ బాయి లా స్వధర్మం స్వరాజ్యం స్వాభిమానం కై కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. విర వనితను స్మరించుకోవటం, ఆమె ధీరత్వాన్ని గుర్తు చేసు కోవటం, బ్రిటిష్ వారిని ఎదిరించటం , ఆమె ఆత్మాభిమానాన్ని  ఈ నాటి ఆడ పిల్లలకి ఎంతో స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు  . ఈ సందర్భంగా స్త్రీ శక్తి దివస్ గా ఝాన్సీ లక్ష్మి బాయి జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర అధ్యక్షుడు మహేష్ నగర కార్యదర్శి రమేష్ నగర సాయ కార్యదర్శి నవీన్ కార్యకర్తలు రాజు సాయి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment