నష్టపోయిన రైతుల్నిప్రభుత్వం ఆదుకోవాలి : జేఏసీ నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 25 : అకాల వర్షానికి నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని రెబ్బెన మండలం కిష్టాపూర్, కొమరవెల్లి గ్రామాలలో జరిగిన పత్తి, వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని జాక్ ఛైర్మెన్ మిట్ట దేవేందర్, కో-చైర్మెన్ బోగే ఉపేందర్, జిల్లా కో-కన్వీనర్ రాయిల్లా నర్సయ్య, మండల కో కన్వీనర్ మల్లయ్యలు అన్నారు. శనివారం ఆ రెండు గ్రామాలలో పంట పొలాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు రైతులకు నోటి దాకా వచ్చిన పంటలు అకాల వర్షాలు కారణం చేత వరి మరియు పత్తి రైతులు నష్టపోయారని వారికి నష్టపరిహారం ఎకరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు సరైన వర్షపాతం లేక చెరువుల కింద వరి పంట వేసిన రైతులు ఎంతోమంది ఉన్నారని వారికి ప్రభుత్వం తరుపునుంచి సహాయం కావాలని కోరారు.వీరితో పాటు జెఎసి జాక్ నాయకు ప్రేమకుమార్, శ్రీనివాస్,తిరుమలు మరియ రైతులు ఉన్నారు.
No comments:
Post a Comment