Wednesday, 22 November 2017

మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలి : రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం

మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలి :  రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 22 :  రాష్ట్రవ్యాప్తంగా సఖి కేంద్రాలు మహిళా సంస్థలు ఉన్నాయని మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారిని సంప్రదించాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం  అధ్యక్షతన  జరిగిన సదస్సలో వివిధ చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా  కేంద్రంలో మహిళా అవగాహన సదస్సు రెండవ రోజు  మాట్లాడుతూ  181 హెల్ప్లైన్  మహిళలకు పూర్తి అండగా ఉంటుందని  కాల్ చేస్తే సలహాలు కౌన్సిలింగ్ రక్షణ కల్పిస్తుంది అన్నారు డిటి హెల్ప్లైన్ వారానికి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా సేవలు అందిస్తుందా అందించుటకు అందుబాటులో ఉంటుందన్నారు. జోగిని వ్యవస్థ జోగినీలు  సమాజానికి బానిసలవుతున్న వాస్తవాలను చిత్ర రూపంలో ప్రదర్శించారు అదే విధంగా సమాజంలో పెరుగుతున్న అద్దెగర్భాల యొక్క సంస్కృతిపై విచారం వ్యక్తం చేశారు అద్దెగర్భం విధానం అనేది మహిళల హక్కులకు భంగం కలగడమే అన్నారు.  పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు మగవారితో పాటుగా  సమాన హక్కులను కల్పించాలన్నారు వృక్షో రక్షితి రక్షిత అన్నట్లుగా మహిళా రక్షితి రక్షిత అన్న చందంగా మన జాతిని మనమే రక్షించుకోవాలన్నారు ఆకాశంలో సగభాగం  మహిళ అని సమాజంలో సగ భాగం మహిళ అని  సృష్టికి మూలం మహిళ, మహిళ లేనిదే మానవ మనుగడ శూన్యం అని చెప్పుకుంటున్నామని ఇది మహిళా స్థితిగతులలో గుణాత్మకమైన మార్పు ఒక పక్క కనబడుతూనే, మహిళలపై వివక్ష మరో పక్కన కొనసాగుతున్నదని అన్నారు.   ఏ రోజయితే ఈ దేశంలో మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా నడిచి వెళ్ళగలుగుతుందో  ఆ రోజు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినట్లు అని అన్నారు.  ఆనాడు జాతిపిత మహత్మగాంధీ మహిళల స్థితిగతులు దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలనుద్దేశించి చెప్పిన మాటలు నేటికి మనం  మననం  చేసుకోవా చేసుకోవలసిన పరిస్థితి ఉన్నదని  స్వాతంత్ర్య సమరాన్ని నడిపే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకు రాగలిగారు కానీ ఈ నాటికి జాతిపిత ఆశించిన విధంగా మహిళలకు సంబంధించిన నిజమైన స్వాతంత్య్రం వచ్చిందా అన్నది నేడు మన ముందున్న ప్రశ్న అన్నారు అందువల్ల మహిళలు జాగ్రత్తతో ముందుకెళ్లాలని చట్టాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు సమస్యల పరిష్కార మార్గాల నిమిత్తం రాష్ట్ర మహిళా కమిషన్కు వ్యక్తిగతంగా పోస్టు ద్వారా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసే సత్వర న్యాయం చేస్తానన్నారు మహిళలు అన్ని రంగాలలో ధైర్యంగా దూసుకెళ్లాలని మహిళాసాధికారతను సాధించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క మహిళ చేయి చేయి కలిసి హింసను ఎదుర్కొని మహిళల హక్కులను సాధించాలన్నారు ఈ అవగాహన సదస్సులో హైకోర్టు న్యాయమూర్తి విజేత, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజేషన్ సరోజ, పిడి సావిత్రి సిడిపిఓలు, సూపర్వైజర్లు అరగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment