Friday, 17 November 2017

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వనమాల మురళి

కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షుడిగా వనమాల మురళి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ  రెబ్బెన  మండల  అధ్యక్షుడిగా  మండల కేంద్రానికి చెందిన వనమాల మురళిని నియమించడం జరిగిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు ఒక ప్రకటనలోతెలిపారు.   సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన  వనమాల జక్కయ్య   కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించడం జరిగిందని ఆయన సేవలకు కొనసాగింపుగా  ఆయన కుమారుడు  మురళిని నియమించడం జరిగిందని అన్నారు.    ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ అధిష్ఠానం తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా నియమించడం  జరిగిందని తనవంతు ఏ  లోటు లేకుండా పార్క్ పటిష్ఠతకు కృషిచేస్తామన్నారు. 

No comments:

Post a Comment