Sunday, 19 November 2017

ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలు

ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 19 ; భారత దేశ మొదటి మహిళా  ప్రధాన మంత్రి   స్వర్గీయ ఇందిరా గాంధీ శతజయంతిని ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలొ మాజీ శాసన సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు స్థానిక ఏస్.సి గురుకుల పాఠశాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది. అనంతరం ఆత్రం సక్కు  మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్న కాలం లో దేశంలోని బ్యాంకులను జాతీయం చేశారన్నారు. దేశంలోని పేద,  బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారు అని గరీభి హటావో అని పిలుపునిచ్చి పేద వారి ఎదుగుదలకు ఎస్ సి, ఎస్ టి వర్గాల అభ్యున్నతి కి ఎంతో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రవీందర్,ఎం పి  టి సి  సభ్యులు కోవూరు శ్రీనివాస్, పి ఎ సి ఎస్ చైర్మన్ గాజుల రవీందర్, వైస్ చైర్మన్ వెంకటేశం చారి, అధికార ప్రతినిధి వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు రాజేశ్, దేవజి ఎస్టి  సెల్ నాయకులు రమేశ్, వశ్రం నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు జలపతి, ఎన్.ఎస్ యు.ఐ నాయకులు హరీష్, సంతోష్, కిషన్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment