Thursday, 23 November 2017

సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర ; మద్దిలేటి

సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర ; మద్దిలేటి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 23 : సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల  ద్వారానే వరికి  గిట్టుబాటు ధర లభిస్తుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి మద్దిలేటి అన్నారు.గురువారం  రెబ్బెన మండలంలోప్రాధమిక సహకార సంఘం ఆధ్వర్యంలో   వరి   కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తమ కేంద్రాల్లో ఏ  గ్రేడ్ వరికీ 1590 ,బిగ్రేడుకు   1550 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు.సహకార శాఖ  ఆధ్వర్యంలో ఇప్పటివరకు  జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాచేస్తున్నామన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి  సంజీవ్ కుమార్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, సింగల్ విండో  చైర్మన్ జి రవీందర్, సివిల్ సప్లైస్ జిల్లా అధికారి గోపాల్, డిఎస్ఓ లక్ష్మీనారాయణ, డీ ఎ సి ఓ రబ్బాని, కోపరేటివ్ వార్ ఆడిటర్స్ శ్రీదేవి రాజేశ్వరి, సి ఈ  ఓ సంతోష్ కుమార్, సింగల్ విండో డైరెక్టర్ పేసరి మధునయ్య,  షైక్ మహమూద్,వెంకటరమణ, షైక్ ఇమామ్, రాజేశ్వరి, శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment