కార్మికుల ఆకాంక్ష నెరవేర్చింది టీ బి జి కే ఎస్
ద్వారా సమావేశంలో ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4 ; సింగరేణి కార్మికుల ఆకాంక్షన వారసత్వ ఉద్యోగాలను కేసీఆర్ హామీ తోని నెరవేరిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమేనని టిబిజికె ఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య అన్నారు. శనివారం రెబ్బెన మండలంలోని గోలేటి డోర్లి ఓసిపిలో ద్వారా సమావేశం నిర్వ హించి టిబిజికె ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 18స లుగా నోచుకోని వారసత్వ ఉద్యోగాలు అమలులో పెట్టడం టిబిజికె ఎస్ ఘనతే అని అన్నారు. జాతీయ సంఘాలు అనేక రకాల సాకులతో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నయి అని జాతీయ సంఘాల వికారిని తీర్పుగా ఖండించారు కేసీఆర్ గొప్ప మనసుతో వారసత్వఉద్యోగాలు ప్రకటించడమే కాదు సర్వీస్ కి నిబంధనలను సవరిస్తూ 35నుండి 40సం వయసు కు పెంచడం జరిగింది అన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ఎం,శ్రీనివాస్ రావు ,బీపీఎల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదాశివ్,ఏఎంసీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ , నాయకులూ రాంబాబు, శంకర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment