Monday, 20 February 2017

మా కొలువులు మాకు కావాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

మా కొలువులు మాకు కావాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 20 ; ఈ నెల 22వ తేదిన హైదరాబాద్ లో తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీకి విద్యార్థులు,యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున కాగజ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వలన విద్యార్థులకు,యువకులకు నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు,యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉద్యమాలు నిర్వహించి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను యువకులను విస్మరించిందని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని,ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని,ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలండర్ రూపొందించి అమలు పరచాలని,ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని,డియస్సీ వెంటనే నిర్వహించాలని నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నమని విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్,మండల అధ్యక్షుడు రవివర్మ,కార్యదర్శి సంపత్ ,శివ, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment