Friday, 17 February 2017

గోలేటి క్రాస్ రోడ్డు వద్ద సిఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

గోలేటి క్రాస్ రోడ్డు వద్ద సిఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు                        


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ;  వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అన్నారు.శుక్రవారంనాడు రెబ్బెన మండలంలోని గోలేటి క్రాసు రోడ్డు వద్ద ప్రత్యేక వాహనా తనిఖీ లు నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐ మదన్ లాల్ మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా శిరస్త్రణ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు వాహన చోదక అర్హత పత్రాన్ని కలిగి ఉండాలి అని అన్నారు.అదే విధంగా వాహనాలకు సంబంధించిన  దృవీకరణ పత్రాలు అయినా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్,లైఫ్ టాక్స్ వంటి రవాణాశాఖ ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.సరైన పత్రాలు లేని వాహన యజమానులకు జరిమానా విధించారు.మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకూడదని ఒక వేల నడిపినట్టైతే వారి తల్లిదండ్రులు శిక్షార్హులని హెచ్చరించారు.చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని  అన్నారు.సిఐ వెంట సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment