సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నేడు ప్రారంభం
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 21 ; సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నేడు ప్రారంభం కానుందని ఈ ప్రారంభానికి ఎమ్మెల్సీలు పురాణం సతీష్ కుమార్, రాములు నాయక్ , ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, దుర్గం చిన్నయ్యలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని బెల్లంపెల్లి ఏరియా అధ్యక్షుడు బి. భద్రు తెలిపారు .రెబ్బెన మండలం లోని గోలేటి లో మంగళవరం విలేకరుల సమావేశం లో అయన మాట్లాడారు ఈ సందర్బంగా జెండా ఆవిష్కరని కార్యాలయం ప్రారంభం కార్యక్రమం ఉంటుందని అనంతరం సభ కార్యక్రమాలు నిర్వహించ బడతాయన్నారు ఈ కార్యక్రమానికి సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ,ఉద్యోగులుగ మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ , రాజయ్య ,అడ్వైజర్ ,అరవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment