కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 25 ; తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పథకాల ను ప్రవేశ పెట్టి వివిధ సంక్షేమలను అమలు చేస్తుందని పల్లె ప్రగతి కోసం తెరాస ప్రభుత్వం తోనే సాధ్యం అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు . శనివారం రెబ్బెన మండలములో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు . గోలేటిలోని పెద్ద బావి నుండి సేవాలాల్ మందిర్ వరకు, భగత్సింగ్ నగర్, ఖైర్గుడా, ఇందిరానగర్, నక్కలగూడ సీసీ రోడ్ ల నిర్మాణం కొరకు భూమిపూజ చేసారు. అనంతరం రెబ్బెన లోని అతిధి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఇతర పార్టీ లో నుంచి నాయకులు కార్యకర్తలు తెలుగు యువ మండల అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్, తెలుగు రైతు మండల అధ్యక్షుడు రావు జి, నాయని బ్రాహ్మణా సంఘం , మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, నేర సంఘ నాయకులూ రాయల కృష్ణ, తెలుగు మహిళా నాయకురాలు రాజేశ్వరి లు పార్టీ లో చేరి తెరాస ఖండువాలు కప్పుకున్నారు ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పతకాలను చూసి ఇతర పార్టీ కార్యకర్తలు తెరాస లో చేరారన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం తో ఎంతో వెనకపడి పోయిన ఏరియా ని మన తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకొని మన ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రెండు వందల రూ ఉన్న వృద్ధాప్య పింఛన్లు రెండు వేలకు గాను పెంచారు అలాగే వికలాంగులు పింఛన్లు 500రూ నుండి 1500గాను , రేషన్ నాలుగు కిలోల నుండి ఆరు కిలోల వరకు పెంచిన ఘనత కెసిఆర్దే అని అన్నారు. కల్యాణ లక్ష్మి పతాకం కింద ఎస్ సి , ఎస్ టి లేక్ పరిమితం కాకుండా బీసీ ఓసి లకు కూడా వర్తించేలా వారిలో కూడా నిరుపేదలు ఉన్నారని గుర్తించి తెరాస ప్రభుత్వం పతకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరువులను ఎంతో అభివృద్ధి చేశామని, పేర్కొన్నారు . రక్షిత మంచి నీటి పథకము పనులు వేగవంతముగా జరుగుతున్నాయని , ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందిస్తామని , . ఈ కార్య క్రమములో జెడ్ పి టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్, జిమ్ రవి శంకర్, ఏ ఎం సి కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక , సర్పంచ్ వెంకటమ్మ, తోట లక్ష్మన్, సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్, చిట్టిబాబు, మల్రాజ్ శ్రీనివాస్ రావు,కోఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని, సింగల్ విండో డైరెక్టర్లు మధునయ్య, సత్యనారాయణ, గుడిసెల వెంకన్న గౌడ్, రమేష్ తధీతరులు ఉన్నారు.
No comments:
Post a Comment