కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 తేదీనుండి 11 తేది వరకు నిర్వ హించే జాతర నిర్వహణలో అధికారులు అప్రమత్తంగ ఉండాలని కలెక్టర్ ఎం.చంపాలాల్,ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్,ఎమ్మెల్యే కోవా లక్ష్మిలు సూచించారు.శుక్రవారము రోజున స్థానిక ఎం పి డి ఓ కార్యాలలయంలోని సమావేశ మందిరంలోఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల అన్ని శాఖల అధికారులతో రివ్యు నిర్వహించారు జాతర విజయవంతానికి,పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్ అధికారి పాండురంగారావును ప్రత్యేక అధికారిగా నియమించారు.అనంతరం కలెక్టర్ ,ఎమ్మెల్సీ ,ఏమ్మెల్యే మాట్లాడుతూ వైద్యసదుపాయం,త్రాగునీరు,ఆ ర్. టి . సి .బస్సు సౌకర్యం,విద్యుత్ సౌకర్యం పారిశుధ్యం, ట్రాఫిక్ కంట్రోల్, ఎన్ఎస్ఎస్ సేవల అంశాలపై నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.అదే విధంగా త్రాగునీరు నిరంతరం అందించాలని గ్రామీణ నీటి పారుదల శాఖను ఆదేశించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు,.అదే విధంగా సింగరేణి బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు,విద్యుత్తు సౌకర్యాలు తమ సంస్థ ద్వారా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలోఆసిఫాబాద్ డిఎస్పీ భాస్కర్, రెబ్బెన సిఐ మదన్ లాల్, తహసీల్ధార్ రమేష్ గౌడ్, జడ్పిటిసి బాబురావు, ఎంపిడిఓ సత్యనారాయణసింగ్, రెబ్బెన ఎస్.ఐ దారం సురేష్,ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్ సింగ్, గంగాపూర్ సర్పంచ్ రవీందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు గంటు మేర, పీడీ శంకర్, ఆర్టీసీ ఆసిఫాబాద్ డియం శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment