కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 8 ; రెబ్బెన మండలలంలోని ప్రతి ఒక్కరు నులి పురుగుల నివారణకు కృషి చేయాలనీ ప్రోగ్రాం అధికారి సునీల్ రావు రెబ్బెన,ప్రభుత్వ వైధ్యాధికారి సంతోష్ సింగ్ లు అన్నారు. రెబ్బన మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు ఆశ వర్కర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణను ఇచ్చారు ఈ సందర్బంగా వారు మాట్లాడరూ నూలిపురుగుల మాత్రలు వేయించడం వలన రక్తహీనత,సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని నులి పురుగుల ఓ పరాన్న జీవి. ఇది మనుషుల పేగుల్లో నుంచి పోషకాలను గ్రహిస్తాయి. ఇవి చిన్నారుల పాలిట అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు. మొదట ఏలిక పాములుగా పుట్టి, నులి పురుగులుగా ఎదిగి, కొంకి పురుగులుగా మారుతాయి. ఇలా మూడు దశల్లో వ్యాప్తి చెందే పురుగులు ఆరోగ్యాన్ని హరిస్తాయిన్నారు ప్రతి పాటశాలలో అంగన్వాడి కేంద్రాలలో తప్పని సరిగా నులిపురుగు మాత్రలను పిల్లలకు వేయాలని 1 సం,, నుంచి 3 సం,, పిల్లలకు సగం మాత్ర వేయాలని అదేవిధంగా 3 సం,, నుంచి 19 సం,, పిల్లలకి ఒక్క మాత్ర వేయాలని అన్నారు భోజనం చేసిన అరగంట తరువాత మాత్రను సప్పరించాలని అన్నారు ప్రత్యేకంగా శిషణ పొందిన కార్యకర్తలచే మందులు వేయలని అన్నారు. 15 తేదిన పిల్లలందరికీ నులి పురుగుల మాత్రలు కచితంగా వేయాలని అన్నారు
No comments:
Post a Comment