Thursday, 23 February 2017

సింగరేణి భూనిర్వాసితులకు అండగా ఉంటాం -కిషన్ రెడ్డి


సింగరేణి భూనిర్వాసితులకు అండగా ఉంటాం -కిషన్ రెడ్డి


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 23 ; సింగరేణి లో ని భూనిర్వాసితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ శాసన పక్షనేత కిషన్ రెడ్డి అన్నారు . గురు వారము బెల్లం పల్లి   గనులపై పర్యటించి మాట్లాడారు . ముందుగా ఖిరిగూడ ద్వారా సమావేశములో కార్మికులతో మాట్లాడారు . వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు . సింగరేణి ప్రభావిత ప్రాంతమైన అబ్బాపూర్ సోనాపూర్ గ్రస్తులతో కలిశారు . స్సింగరేణి కార్మికులు తమ జీవితాలను అంకితం చేస్తూ ప్రపంచానికే వెలుగులు నింపుతున్నారని   తెలిపారు . కార్మికులకు ఆండగా ఉంటామని చెప్పారు , సింగరేణి రాష్ట్రములో చాలా పెద్ద పరిశ్రమ అని , దానిని రక్షించుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని అన్నారు . సింగరేణి కార్మికులకు ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు .  తెలంగాణా రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఘణనీయం అన్ని అన్నారు . సింగరేణి సమ్మె  తో కేంద్ర ప్రభుత్వాన్ని గదా గడలాడించారని అన్నారు .  కోల్ ఇండియా లో మాదిరిగా అలవెన్సులు లేవని తెలిపారు . కార్మికులకు మెరుగైన సేవలు అందడము లేదని పేర్కొన్నారు . సింగరేణి యాజమాన్యము , ప్రభుత్వము కార్మికులకు వైద్యము అందించడములో విఫలమైందని తెలిపారు . సింగరేణి కార్మికుల సమస్యలపై నివేదికతో ముఖ్యమంత్రి , కేంద్రమంత్రి , ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని అన్నారు . కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకే బొగ్గు బాయి  యాత్ర చేపట్టామని అన్నారు .ఈ కార్యక్రములో రాష్ట్ర నాయకులు గొనె శ్యామ్ సుందర్ , జిల్లా అధ్యక్షుడు జె బి పౌడెల్ , నాయకులూ బోనగిరి సతీష్ , మాజీ ఎం ఎల్ ఏ గుజ్జల రామ కృష్ణ రెడ్డి సునీల్ చోదరి ఆంజనేయులు గౌడ్ , కిషన్ గౌగ్, రాంబాబు తైతరులు ఉన్నారు .

No comments:

Post a Comment