అడా ప్రాజెక్ట్ వద్ద మౌలిక వసతుల ఏర్పాటుకై పరిశీలన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 : కొమురంభీం జిల్లాలోని ఆడా ప్రాజెక్టు వద్ద గల అటవీ ప్రాంతంలో ట్రాకింగ్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు కొరకు జిల్లా పాలనాధికారి చంపాలాల్ పర్యటించారు. జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరం భీం ఆడా నీటి పారుదల ప్రాజెక్టు సమీపంలో ట్రాకింగ్ ప్రణాళిక రూపొందించేందుకు ఈ ప్రాంతాన్ని గురువారం సందర్శించా రు. ఆ ప్రదేశంలో ఏ సమయంలోనైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు వీలుగా వాచ్ టవర్ నిర్మించేందుకు మరియు ట్రాకింగ్ సౌకర్యం కల్పిస్తే ఆ ప్రదేశం పర్యాటక అభివృద్ధి చెందుతుందని అన్నారు. దానికి అనుగుణంగా జిల్లా పాలన అధికారి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తామని జిల్లా పాలనాధికారి అన్నారు. కఠినమైన ఆడా పరిసర ప్రాంతాల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం మరియు కొండ పై నుంచి ఎటు చూసినా పచ్చటి వాతావరణం ఉంటుందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారితో అన్నారు . గుట్టపై నుంచి అడ ప్రాజెక్టు పరిసరాలను వీక్షించేందుకు వీలుగా నిర్మించబోయే వాచ్ టవర్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ట్రెక్కింగ్ ట్రాక్ మరియు అటవీప్రాంతాన్ని సందర్శించారు .వాచ్ టవర్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పూర్తిగా ఐదు కిలొ.మి కాలినడక ప్రయాణం చేస్తూ అలాగే మిషన్ భగీరథ పనులను జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు అందులో భాగంగా ఫేజ్ వన్ లో భాగంగా 115 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇంట్రెస్ట్ వాల్ వన్లో నైన్టీన్ పర్సన్ పనులు పూర్తయ్యాయని ఇందులో 116 ఎం ఎల్ డి 90% పనులు పూర్తయ్యాయని 10 % త్వరలో పూర్తి పూర్తయితేనే అన్నారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారితోపాటు సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్,, జిల్లా అధికారులు పాల్గొన్నారు.