Tuesday, 19 September 2017

భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి ; జిల్లా కలెక్టర్ చంపాలాల్


భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి ; జిల్లా కలెక్టర్ చంపాలాల్ 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 19 ;  భూ సర్వే ను పక్కాగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. సర్వే లో భాగంగా  మంగళవారం  రెబ్బెన  మండలం జక్కులపల్లి గ్రామంలో  జరుగుతున్న  భూ సర్వే  ను జిల్లా కలెక్టర్ చంపాలాల్ పరిశీలించారు. రైతులను భూ సర్వే పై అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు  చేసారు. సర్వే ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో చేపట్టిందని  దానిని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలని అన్నారు  ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ గౌడ్, ఉప తహసీల్దార్ విష్ణు ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment