Friday, 29 September 2017

ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌ స్మృతి లో మోహురం పీరీల పండుగ

ఇమామ్‌ హసన్‌, ఇమామ్‌ హుసైన్‌ స్మృతి లో మోహురం పీరీల పండుగ 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 29 :   పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు."ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. ఇంతటి గణ చరిత్ర గల మోహురం పండుగని రెబ్బెన మండలం  లోని పుంజుమెరగుడ లో వైభవంగా కులమతాలకు అతీతంగా  నిర్వహిచడం జరిగింది.  ఇంతటి మహిమ  కలిగిన బంగాళా కి ఇతర రాష్ట్రాల నుండికూడా అధిక సంఖ్య లో భక్తులు మొక్కులు చెల్లిస్తుంటారు.ఈ సందర్బంగా శుక్రవారము  పీరీలను గ్రామాల  విదులలలో ఊరేగించడం జరిగింది 

No comments:

Post a Comment