కేజీబీవీ పాఠశాలల్లో గందరగోళం సృష్టిస్తూన్న అధికారులు ; విద్యార్థి సంఘాల నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 14 ; జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, పి.డి.యస్.యు జిల్లా ఇంచార్జ్ పాపారావు, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ గణపతి ఆరోపించారు. గురువారం రోజున అధికారుల నిర్లక్ష్యనికి నిరసనగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత రెండు నెలల నుండి జిల్లాలోని కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో ఆందోళనలు జరుగుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరిస్తూన్నరని అన్నారు. సిర్పూర్ (యు) కేజీబీవీ నుండి కౌటాల కేజీబీవీ కి బదిలీ ఐన సిఆర్టిలు విధుల్లో చేరకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. అధికారుల ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకొవాల్సిన అధికారులు చర్యలు తీసుకోకుండా వారు కోరుకున్న చోటు జైనూర్కి బదిలీ చేశారని ఆరోపించారు. జైనూర్ కెజిబివి నుండి సిర్పూర్ యు కు బదిలీపై రావాల్సిన సిఆర్టిలు రాకుండా ఉండడంతో మళ్లీ సిర్పూర్ యు కి బదిలీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకొవాల్సిన అధికారులు వారిని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని అన్నారు. రెండు నెలల్లో అధికారులు నాలుగు బదిలీల ఉత్తర్వులు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా కెజిబివి పాఠశాలల్లో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుడాదని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకొవాలని అలాగే గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో నిరహర దీక్ష చేస్తామని దీనికి పూర్తి బాధ్యత అధికారులే వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, జిల్లా పర్వతి సాయి, పి డి యస్ యు నాయకులు తిరుపతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment