Tuesday, 5 September 2017

ఘనంగా గురుపూజోత్సవం

ఘనంగా గురుపూజోత్సవం 

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 :   రెబ్బెనలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉన్నతపాఠశాలు మరియు పాఠశాలల లో  ఈ రోజు గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు  భారతరత్న   శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకొని  ఆయన జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు   తన ఇరవైఒక్కటవ యేట ప్రొఫెసర్ గా  తన ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఈ దేశానికీ సేవలందించడమే కాకుండా  విద్యాసంస్కరణలపై ద్రుష్టి పెట్టి పలు సూచనలు చేసారు. ఆయన సేవలను గుర్తించి ప్రతియేటాఆయన జన్మదినమైన  సెప్టెంబర్  ఐదవ తారీఖున టీచర్స్ డే గ నిర్వహించుకుంటున్నాము. 

No comments:

Post a Comment