కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 17 ; భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లో ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి మండలంలోని అన్నిప్రాంతాల విశ్వబ్రాహ్మణులు సకుటుంబంగా పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. . ఉదయం 10 గంటలకు విశ్వకర్మ ధ్వజం వేదోక్తంగా ఆవిష్కరించి,పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో సామూహిక పూజలు నిర్వహించారు. జిల్లా విశ్వకర్మ కన్వీనర్ పంచలపు లక్ష్మణాచారి పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా కో కన్వీనర్ ఎం సదాశివాచారి సింగల్ విండో వైస్ చైర్మన్ వెలువోజు వెంకటేశం చారి, , కే రవీంద్రాచారి, వెంకటేశం చారి, శంకర్ చారి, రామయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment