ఏఐటీయూసీ చుక్క గుర్తుకే ఓటు వెయ్యండి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 27 : సింగరేణిలో ఐఎన్టీయూసీ బలపరుస్తున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చుక్క గుర్తుకే కార్మికులు ఓటు వెయ్యాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కార్మికులకు మరొకసారి విజ్ఞప్తి చేశారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ లోని సీపీఐ తాత్కాలిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ గత నాలుగు సంవత్సరాల కాలంలో కార్మికులకు చేసింది ఏమిలేదని ఈ విషయం కార్మికులకు బాగా తెలుసనీ అక్టోబర్ 5 న జరిగే ఎన్నికలలో కార్మికులు ఈ విషయాన్నీ నిరూపిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో . ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్ర్షి ఎస్.తిరుపతి నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment