Friday, 22 September 2017

ఎన్నికలకోసమే అనైతిక పొత్తుపెట్టుకొన్నజాతీయ సంఘాలు : టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు

ఎన్నికలకోసమే అనైతిక   పొత్తుపెట్టుకొన్నజాతీయ  సంఘాలు  : టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు


  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 22 :   కేవలం సింగరేణి గుర్తింపు సంఘం  ఎన్నికలకోసమే అనైతిక   పొత్తుపెట్టుకొన్నజాతీయ  సంఘాలను    ఓడించాలని   టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్ రావు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలం గోలేటి కైరిగుడా ఓపెనకాస్ట్ వద్ద గేట్ మీటింగ్ లో శుక్రవారం మాట్లాడుతూ  . సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా సీఎం కెసిఆర్ వారసత్వ  ఉద్యోగాలను పునరుద్ధరిస్తారని పేర్కొన్నారు. ఆనాడు సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టడానికి అన్ని  జాతీయ సంఘాలదే బాధ్యత అని అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరించే సత్తా ఒక్క సీఎం కెసిఆర్ కె ఉందన్నారు . అవసరమైతే చట్ట సవరణకు కూడా సీఎం వెనకాడరని అన్నారు. ఇక పోతే నిజామాబాద్ ఎంపీ టిబిజికెఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏఐటీయూసీ నాయకులకు హెచ్చరించారు. సింగరేణి కార్మికుల కోసం అలుపు ఎరుగ  కుండా కృషికేస్తున్న ఎంపీ కవితను విమర్శించే అర్హత  ఆ సంఘం నాయకులకు లేదన్నారు . ఉమ్మడి రాష్టం లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు చట్టబద్ధమైన హక్కులను పోగొట్టిందే ఏఐటీయూసీ నాయకులని విమర్శించారు,ఈ విషయం సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ తెలుసు అన్నారు. ఎం ఎల్ సీ  పురాణం సతీష్ మాట్లాడుతూ  సీఎం కెసిఆర్  సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తానని ప్రకటన చేసిన వెంటనే ఏఐటీయూసీ నాయకులూ దొంగ చాటున వెళ్లి కోర్ట్ లో కేసు వేసి వారసత్వ ఉద్యోగాలు రాకుండా అడ్డుకుందాని ఆరోపించారు. ఆనాడు గుర్తింపు  సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచి కార్మికులకు చేసిందేమి లేదని విమర్శించారు. ఎం ఎల్ ఏ  లు  దుర్గం చిన్నయ్య, కోవలక్ష్మిలు మాట్లాడుతూ   టిబిజికెఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచాక ఎంపీ కవిత ఆధ్వర్యం లో కార్మికులకు అనేక హక్కులు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా కృషి చేశామని గుర్తు చేసారు ఈ కార్యక్రమం లో  టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు సదాశివ్, నాయకులూ శ్రీనివాస్, రాంబాబు, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment