అధికారులు స్పందించాలి...విద్యార్థిసంఘాల నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 11 ; కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని KGBV పాఠశాలల్లో ఇష్టానుసారంగా బదిలీలు చేపడుతు పాఠశాలల్లో గందరగోళ పరిస్థితి సృష్టిస్తు, సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అధికారులు స్పందించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, PDSU జిల్లా ఇంచార్జ్ పాపారావు, ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు గణపతి, డిమాండ్ చేశారు. సోమవారం రోజున జైనూర్ కెజిబివి విద్యార్థినిల ఆందోళనకు మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత రెండు నెలల నుండి సిర్పూర్ యు కెజిబివి పాఠశాలలో ఆందోళనలు జరుగుతున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గత రెండు నెలల నుండి జిల్లాలో కొన్ని కెజిబివి పాఠశాలలో తరగతులు జరగక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాల్సిన అధికారులే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని దీనికి పూర్తి భద్యత అధికారులే వహించాలని హెచ్చరించారు.ఇంత ఆందోళన జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం చూస్తుంటే అధికారుల పని జిల్లాలో ఎలా ఉందో కనపడుతుంది అని అన్నారు. రెండు రోజులల్లో సమస్యను పరిష్కరించకపోతే డిఈవొ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు.
No comments:
Post a Comment