Tuesday, 5 September 2017

క్రమ శిక్షణ తో చదవాలి - సర్పంచ్ వెంకటమ్మ

క్రమ శిక్షణ తో చదవాలి - సర్పంచ్ వెంకటమ్మ 

 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 05 ; విద్యార్థులు క్రమశిక్షణ తో చదవాలని , ఉన్నత  శిఖరాలను అధిరోహించ వచ్చ్చని రెబ్బెన గ్రామ సర్పంచ్ పెసర వెంకటమ్మ అన్నారు . రెబ్బెన లోని సాయి విద్యాలయం (ఎస్ వి )ఇంగ్లిష్ మీడియం హై  స్కూల్ లో నిర్వహించిన  ఉపాధ్యాయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చదువు చెప్పే గురువులను , పెద్దలను గౌరవించాలనిచదువులో రాణించాలని పేర్కొన్నారు . సాయి విద్యాలయం యాజమాన్యం  విద్యార్థులను  అన్ని రంగాలలో మండలములో ముందంజలో ఉంచుతున్నందులకు ప్రత్యాక అభినందనలు తెలిపారు . అనంతరము ఉపాధ్యాయులుగా రాణించిన విద్యార్థులకు సర్పంచ్ వెంకటమ్మ, రిటైర్డ్ హెడ్మాస్టర్  చంద్రయ్యలు బహుమతులను  అందజేశారు . ఈ కార్య క్రమములో రిటైర్డ్  ప్రధానోపాద్యాయులు మూలస్తం చెంద్రయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీకొండ సంజీవ్ కుమార్ , కరస్పాండెంట్ దీకొండ విజయ కుమారి , ఉపాధ్యాయులు సుజాత , విద్యాసాగర్ , రేష్మ , విష్ణు , లీల, రాజకుమార్  , ఉదయ , శ్రీ హర్ష ,మహేందర్ , విద్యార్థులు ఉన్నారు . 

No comments:

Post a Comment