Monday, 11 September 2017

మొక్కలు నాటండి పర్యావరణాన్నిరక్షించండి ; తహసీల్దార్ రమేష్ గౌడ్

మొక్కలు నాటండి  పర్యావరణాన్నిరక్షించండి ; తహసీల్దార్ రమేష్ గౌడ్ 


   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 11 ;    రెబ్బెన మండలంలోనిప్రతిఒక్కరు కనీసం ఒక మొక్కనైనా   నాటి  ప్రక్రుతి  ప్రేమికులుగా మారాలని తహసీల్దార్ రమేష్ గౌడ్  అన్నారు. సోమవారం కార్యాలయంలో మామిడిమొక్కలను నాటి  వాటి సంరక్షణ భాద్యతను సిబ్బంది చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పుడో నిజాం కాలంలో నాటిన మొక్కల నీడన ఈ రోజు తన కార్యాలయం ఉందని ,నిత్యం తన ఆఫీసుకు వచ్చే సందర్శకులు వాటి కింద సేదతీరుతుండడం చూశానని, అలాగే ఈ రోజు పాతిన చిరు మొక్కలే రేపటితరానికి మహావృక్షలై  నీడనిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వసంత్, స్థానిక టి ఆర్ ఎస్  నాయకులు   రాజాగౌడ్,  సుదర్శన్ గౌడ్,  అజమేరా రమేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.   

No comments:

Post a Comment