బెల్లంపల్లి ఏరియాలో సి హెచ్ పి నూతన కార్యాలయ ప్రారంభం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 21: బెల్లంపల్లి ఏరియాలో నూతనముగా నిర్మించిన సి హెచ్ పి కార్యాలయమును జనరల్ మేనేజర్ సివిల్ ఎస్ రామభద్రిరాజు బెల్లంపల్లి జనరల్ మేనేజర్ రవి శంకర్ తో కలిసి గురువారంనాడు ప్రారంభించారు. అన్ని వసతులు,సదుపాయములతో నిర్మించిన ఈ కార్యాలయం శుక్రవారంనుండి సిబ్బందికి అందుబాటులోకి రానుంది. దీనివలన ఈ ఏరియాలో బొగ్గు రవాణా మరింత మెరుగుపడి ఉత్పత్తి టార్గెట్ను అధిగమించటానికి దోహదపడుతుందని వక్తలు అన్నారు, ఈ కార్యక్రమంలో సివిల్ ఏ జి ఎం పద్మశ్రీ, క్వాలిటీ కంట్రోల్ రామగుండము రీజియన్ డ్ జి ఎం ప్రసాదరావు, అధికారులు మోహన్రెడ్డి,శ్రీనివాస్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment