రెబ్బెన : కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో సింగరేణి, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ లు పూర్తిగా విఫలమైందని ఏ ఐ టి యూసి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా సింగరేణి బొగ్గు బావుల వద్ద సంబంధిత డిపార్ట్మెంట్లలో వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడాతు. కార్మికుల న్యాయమైన సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా రోజు రోజు సింగరేణిలో రాజకీయలు జోక్యం చేసుకుని సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మారం శీను, నాయకులు ఎస్ రాజన్న, ముద్దసాని వెంకటేశం ,తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment