రెబ్బెన: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శిగా బద్రి సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తిరుపతి లను ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.మంగళవారం గోలేటి లోని కె.ఎల్ మహేంద్ర భవన్లో జరిగిన సిపిఐ జిల్లా నిర్మాణ మహాసభలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా దుర్గం రవీందర్, ఆత్మకూరి చిరంజీవి, ప్రకాష్, ఉపేందర్, లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
No comments:
Post a Comment