రెబ్బెన : రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ గ్రామం లో సర్పంచ్ రాజ్యలక్ష్మి తిరుపతి అధ్యక్షతన గురువారం గ్రామంలో పూర్తిగా మద్యపానం నిషేధం చేయాలని తీర్మానిచారు గ్రామస్తు యువకులు మద్యానికి బానిస కావడం వలన తరుచు గొడవలకు కారాణాలు అవుతున్నావి పూర్తిగా మద్యపానాన్ని నిషేదించాలని బెల్ట్ షాపులు మరియు గుడుంబా అమ్మకాలు నిషేధించాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మీసాల శ్యాంరావ్.ఆదివాసి కొలావార్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్గటి సుధాకర్ కొలావార్ ఆదివాసి మండల అధ్యక్షుడు మైలారపు శ్రీనివాస్, గ్రామస్థులు దుర్గం జానయ్య, కమ్మరి మల్లేష్, దుర్గం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment