రెబ్బెన : పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలను వేయించాలని రెబ్బెన సర్పంచ్ అహల్య దేవి అన్నారు. శనివారం మండలంలోని పుంజుమేరగుడా గ్రామంలో అవులకు , గేదెలకు ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో పశువులకు గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలను వేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ తప్పని సరిగా టీకాలను పశువులకు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ - పుష్పాలత పశు వైద్య సిబ్బంది తదితర రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment