Wednesday, 26 February 2020

ప్రారంభమైన 7వ ఆర్థిక గణన (ఎకనామిక్ సర్వే)



రెబ్బెన :  జిల్లా పాలనధికారి ఆదేశాల మేరకు  7వ ఆర్థిక గణన   కార్యక్రమాన్ని  బుధవారం రెబ్బెనమండలం లోని ఖైర్గం గ్రామా పంచాయితి లో డిజిటల్ సేవ కేంద్రం నిర్వాహకుడు దుర్గం పవన్ కుమార్  ప్రారంభించినట్లు తెలిపారు.  ఈ ఆర్థిక గణన మొదటి సారిగా దేశవ్యాప్తంగా డిజిటల్ రూపంలో , మొబైల్ అప్లికేషన్ ద్వార నిర్వహిస్తున్నాట్లు  దీనికి గాను   ప్రజలు సహకరించి సమాచారం అందించాలన్నారు. ఎటువంటి ఆటంకాలు వాటిల్లకుండా సర్వే సజావుగాకొన సాగుతుంది అని తెలిపారు. సర్వే నమోదు కొరకు 12మంది ఎన్యుమరేటర్లు ఉన్నారని, ఏప్రిల్ నెలాఖరు వరకు రెబ్బెన మండలం పూర్తిగా సర్వే చేస్తామని చెప్పారు. కేవలం రెబ్బెన మండలం మాత్రమే కాకుండా , జిల్లా వ్యాప్తంగా కూడా సర్వే జరుగుతుందని  అన్నారు

No comments:

Post a Comment